పని మీద మీ సేవకు వెళ్ళింది.. అక్కడే కామాందుడు ఉన్నాడని ఊహించలేదు.. చివరికి?
మీ సేవ కేంద్రం నిర్వహిస్తూ ఇక అందరికీ సర్వీసులు అందించాల్సిన ఒక వ్యక్తి చివరికి నీచానికి పాల్పడ్డాడు. ఏకంగా మీసేవ సెంటర్ కు ఏదో పని వచ్చిన బాలికను మాయమాటలు చెప్పి లొంగ తీసుకొని చివరికి అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ దారుణమైన ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఈ దారుణ ఘటన ఎక్కడో కాదు అటు హైదరాబాద్ నగరంలోని దూద్ బౌలిలో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిపై హైదరాబాద్ కామటిపుర పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
దూద్ బౌలి కి చెందిన నిరంజన్ కుమార్ అనే 39 ఏళ్ల వ్యక్తి మీ సేవ కేంద్రం నిర్వాహకుడిగా ఉన్నాడు. అయితే జిరాక్స్ ల కోసం ఇటీవల 17 ఏళ్ల బాలిక మీసేవ కేంద్రానికి వెళ్ళగా ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఇక సదరు బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపగా.. బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక నిరంజన్ కుమార్ ని అరెస్టు చేశారు.