జైల్లో 196 మంది మహిళలు ప్రసవం.. అసలు ఎలా గర్భం దాల్చారు?

praveen
సాధారణం గా వివిధ నేరాల కింద జైల్లోకి వెళ్లి  శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు బయట ప్రపంచం తో ఎలాంటి సంబంధం ఉండదు. జైల్లోనే ఉంటూ జైల్లోనే పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలం లో జైల్లో కూడా లైంగిక దాడులు పెరిగి పోయాయి అన్నదానికి నిదర్శనంగా ఏకంగా వెలుగులోకి వస్తున్న ఘటనలు మారిపోయాయి. ఎందుకంటే మొన్నటికి మొన్న అస్సాం జైలులో ఏకంగా 40 మంది మగవాళ్లకు హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నట్టు పరీక్షల్లో తేలిన ఘటన సంచలనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే జైలులో ఏకంగా మగవారిపై కూడా అత్యాచారం జరుగుతుంది అన్న విషయం ఈ ఘటన ద్వారా అర్థమైంది. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరుపుతూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా జైలలో శిక్షను అనుభవిస్తున్న ఎంతోమంది మహిళా ఖైదీలు చివరికి ప్రసవిస్తూ ఉన్నారట.  ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. ఏకంగా పశ్చిమ బెంగాల్లో 196 మంది మహిళ ఖైదీలు ప్రసవం కావడం ఇక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. బయట ప్రపంచంతో అసలు సంబంధమే లేని మహిళ ఖైదీలు ఎలా ప్రసాదిస్తున్నారు అనే విషయంపై అధికారులు ఇక షాక్ లో మునిగిపోతున్నారు. అయితే దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కస్టడీలో ఉన్న ఖైదీలు ప్రసవించడం ఏంటి అంటూ ప్రశ్నించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది హైకోర్టు. మహిళా ఖైదీలు ఉన్న బ్యారక్ లోకి పురుష అధికారులు ప్రవేశించకుండా నిషేధం విధించాలి అంటూ ఆదేశించింది. ఖైదీల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించింది.


అయితే ఇలా జైలలో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలపై కూడా లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: