అక్కా అంటూ దగ్గరయ్యాడు.. కానీ ఓ రోజు?
అయితే అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టలు తీసుకువచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం అస్సలు మార్పు రావడం లేదు. అయితే ఇటీవల కేరళలో ఏకంగా స్కూల్ టీచర్ ని దారుణంగా దాడి చేసి గాయపరచడమే కాదు ఇక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనంగా మారిపోయింది. రోజులాగే స్కూల్ కి వెళ్ళిన టీచర్ సాయంత్రం తిరిగి రాకపోవడంతో ఆమె భర్త కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు టీచర్ శవమై లభించింది.
ఈ క్రమంలోనే క్లూస్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నందిని అనే మహిళలకు రీల్స్ చేయడం అలవాటు. అయితే రీల్స్ చేయడం మానుకోవాలని నందిని భర్త లోకేషన్ ఎన్నోసార్లు హెచ్చరించిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆయన సైలెంట్ గానే ఉండిపోయారు. అయితే నందిని మేలుకోటకు చెందిన నితీష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అక్క అంటూ ఆత్మీయంగా పలకరించేవాడు. నందిని హత్య తర్వాత నితీష్ కనిపించకుండా పోయాడు. పరారీలో ఉన్న అతని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతను అసలు నిజం చెప్పేశాడు. మధ్యాహ్నం స్కూల్ నుంచి వస్తున్న నందిని మార్గమధ్యంలో కనిపించడంతో.. బండి ఎక్కించుకొని ఓ నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేసి హత్య చేశాడు. అక్క అంటూ పిలుస్తూనే చెడు దృష్టితో చూడటం మొదలుపెట్టిన నితీష్. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆమె ఎన్నోసార్లు హెచ్చరించిన తీరు మార్చుకోలేదు. ఈ విషయం ఎక్కడ బయట పడుతుందో అని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.