అవసరమా బ్రో.. కొద్దిలో రైలు క్రింద పడేవాడివి?

praveen
ఏం జరుగుతుందిలే అని జనాలు అనుకునే చిన్నపాటి నిర్లక్ష్యం చివరికి ఎంతోమంది ప్రాణాలే పోవడానికి కారణం అవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అనవసరమైన పరిస్థితుల్లో పడే తొందరపాటు చివరికి ఊహించనీ రీతిలో ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే కొంతమంది రైలు పట్టాల దగ్గర విన్యాసాలు చేస్తూ ఉంటారు. అనవసరంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉంటారు. ఒకవైపు నుంచి రైలు దూసుకు వస్తూ ఉంటే సాధారణంగా ఇక రైలు పట్టాల దగ్గర రెండువైపుల నుంచి గేట్లు వేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా గేట్లు వేసిన సమయంలో అక్కడ ఉన్న వాహనదారులందరూ రైలు ఆ మార్గం గుండా రైలు వెళ్ళిపోయేంతవరకు కూడా రోడ్డు మీదే వేచి చూస్తూ ఉంటారు. కానీ కొంతమంది కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి గేటు వేసిన కూడా దాని కింద నుంచి మరోవైపుకు దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉంటారు.

 ఇటీవలే ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా ఒకవైపు నుంచి రైలు వస్తుంది. అంతలో గేటు వేశారు. కానీ ఒక కారు డ్రైవర్ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించాడు.  ఏకంగా గేటును దాటి   వెళ్లేందుకు ప్రయత్నించడంతో రైలు ట్రాక్ లో కార్ ఇరుక్కుపోయింది. కారు కారును చూసి కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించారు సిబ్బంది. దీంతో రైలు వెంటనే నిలిపివేశారు. రైలు సిగ్నల్ ని దాటుకుని గేటు వైపు మెల్లిగా కదిలింది. అయితే ఇక ఆ కారు పట్టాలపై ఒకవైపు ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఏమాత్రం అటు ఇటు అయినా చివరికి ఆ కారు రైలు కింద పడి నుజ్జు నుజ్జు అయ్యేది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: