చావులోనే నీతోనే.. భార్య మరణించిన కొన్ని నిమిషాలకే?

praveen
భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్. ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటారు. కానీ నేటి రోజుల్లో భార్యాభర్తల మధ్య ఇలాంటి అన్యోన్యత కనిపించడం లేదు. చిన్న చిన్న కారణాలకే విడాకులు కావాలి అంటూ కోర్టు మెట్లు ఎక్కుతూ ఉండడం చివరికి విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకుంటున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే నేటి రోజుల్లో కూడా దాంపత్య బంధానికి అసలైన అర్థం చెప్పే భార్యాభర్తలు ఉన్నారు అని అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనల ద్వారా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.

 కష్టసుఖాల్లో ఇన్నాళ్లు తనతో పాటు నడిచిన తన భార్య ఇక లేదు అన్న విషయాన్ని ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. భార్య లేకుండా ఇక జీవితాన్ని ఎలా గడపాలో అనే ఆలోచన కూడా అతన్ని మనశ్శాంతిగా ఉండనివ్వలేదు. దీంతో భార్య మరణ వార్త అతని చెవిన పడిందో లేదో చివరికి అతని గుండె ఆగిపోయింది. ప్రాణం భార్యతో పాటే వెళ్ళిపోయింది. ఈ విషాదకర ఘటన తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు దళితవాడలో జరిగింది. పల్లిపాటి నాగూరయ్యా( 68) రమణమ్మ (60) భార్యాభర్తలు. వీరికి కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు.మీరు అందరికీ వివాహం జరిగింది.

 అయితే కష్ట నష్టాలు ఎదురైన సుఖసంతోషాలు వచ్చినా భార్యాభర్తలిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అయితే ఇక మనవళ్లు మనవరాలుతో ఆడుకుంటూ సంతోషంగానే ఉంటున్నారు. ఇంతలో రమణమ్మ ఆరోగ్యం దెబ్బతింది.ఇక మంచానికి పరిమితమైంది. వృద్ధాప్యంలోనూ నాగురయ్య కూలి పనులకు వెళ్లి వచ్చిన డబ్బుతో భార్యకు వైద్యం చేయించేవాడు. ఇక ఇటీవలే ఆమె చివరికి ప్రాణాలు విడిచింది. ఇక ఈ విషయాన్ని గమనించిన నాగూరయ్యా  కుటుంబ సభ్యులను మేలుకొల్పి అతను ఒకే చోట కూర్చుండిపోయాడు. అప్పటినుంచి ఎవరితో మాట్లాడలేదు. ఇక పిల్లలు వెళ్లి అతన్ని కదిలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే ప్రాణాలు విడిచి ఉన్నాడు. ఇలా కేవలం నిమిషాల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: