పరీక్ష కేంద్రంలోకి అడుగుపెట్టగానే.. కుప్పకూలిన విద్యార్థి.. ఏం జరిగిందంటే?
పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ చూస్తుండగానే కుప్పకూలిపోయి నిమిషాల్లో ప్రాణాలు వదులుతున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణాలపై తీపి మరింత పెరిగిపోతుంది అనడంలో సందేహం లేదు. సడన్ హార్ట్ ఎటాక్లు ఇలా ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరిని కూడా బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో సడన్ హార్ట్ ఎటాక్ లకి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ అందరిని మరింతగా భయపెడుతూ ఉన్నాయి అని చెప్పాలి.
ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఆ బాలిక తొమ్మిదవ తరగతి చదువుతుంది. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. కానీ ఇటీవలే ఒక్కసారిగా పరీక్ష రాసేందుకు వెళ్లి కుప్పకూలిపోయింది. ఏం జరిగిందా అని టీచర్లు వచ్చి చూసారు. అందరూ ఒక్కసారిగా షాక్. ఎందుకంటే సడన్ హార్ట్ ఎటాక్ తో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది రాజ్కోట్ జిల్లాలోని జస్టిన్ లో ఉన్న పాఠశాలలో సాక్షి రాజోసర అనే 15 ఏళ్ల విద్యార్థిని పరీక్ష కేంద్రంలో కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.