భర్తకు ఎఫైర్ ఉందనే అనుమానం.. భార్య ఏం చేసిందో తెలుసా?

praveen
భార్యా భర్తల బంధం అంటే అన్యోన్యత ఉండాలి. ఒక్కసారి మూడుముళ్ల.. బంధం తో ఒక్కటైన తర్వాత ఒకరికి ఒకరు కష్టసుఖాలు తోడు  నీడగా ఉండాలి. ఇక ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ ఎన్ని గొడవలు వచ్చిన సర్దుకుపోతూ హ్యాపీగా జీవితాన్ని గడపాలి. కానీ ఇటీవల కాలం లో మాత్రం భార్యా భర్తల మధ్య ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వని జనాలు పరాయి వ్యక్తుల మోజు లో పడి పోయి ఆక్రమ సంబంధాలకు తెర లేపుతున్నారు.


 ఈ క్రమం లోనే  కట్టుకున్న వారిని దారుణం  గా హతమార్చేందుకు కూడా వెనకడుగు వెయ్యని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇంకొన్ని ఘటనల్లో ఏకంగా తమను మోసం చేస్తున్నారు అని అనుమానం తో భర్త లేదా భార్యపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్న ఘటనలు కూడా వెలుగు  లోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి  ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా లో ఏకంగా ప్రియురాలి తో ఏకాంతం గా ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య.


 ఊటుకూరు గ్రామానికి చెందిన మహిళ తన భర్త హిందూపురం లోనే హస్నాబాద్ కు చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలోనే ఓ రోజు భర్త బయటకు వెళ్తుండడం తో అతని ఫాలో అయింది. ఇక అతను ప్రియురాలితో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ వేసింది. ఈ క్రమం లోనే భర్త ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యుల తో వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అయితే భర్త అతని ప్రియురాలు ఇద్దరికీ అరగుండు గీయించింది. అనంతరం ఊరంతా వాళ్ళని ఊరేగించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: