రెచ్చిపోయిన కామాంధులు.. యువకుడిపై అత్యాచారం?

praveen
ఇటీవల కాలం లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే మానవత్వం తో మెలగాల్సిన మనుషులు కాస్త మానవ మృగాలుగా మారి పోతున్నారు. వెరసి సాటి మనుషుల విషయం లో ఎంతో దారుణం గా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలం లో ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలు పెరిగి పోతూనే ఉన్నాయి. దీంతో ఆడపిల్లను ఒంటరిగా బయటకి పంపించాలంటేనే తల్లి దండ్రులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.



 అంతేకాదు ఇక పక్కన కుటుంబ సభ్యులు ఉన్నా కూడా వెనకడుగు వేయని కామాంధులు రెచ్చి పోతున్నారు. కుటుంబ సభ్యులపై దాడి చేసి మరి దారుణంగా అత్యాచారులకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆడపిల్లలపై అత్యాచారం జరగడం గురించి మాత్రమే విన్నాం. కానీ ఇక్కడ ఏకంగా ఒక యువకుడిపై అత్యాచారం జరిగిన ఘటన కాస్త సంచలనగా మారిపోయింది. ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి పై లైంగిక దాడి చేసి వీడియోలతో బెదిరించిన ఘటన అందరిని షాక్ కి గురిచేస్తుంది.



 పుత్తనందం అనే 27 ఏళ్ల యువకుడు ఐటీ ఉద్యోగగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఇటీవల బస్సులో వెళుతుండగా అరివలిగన్ అనే మరో వ్యక్తితో గొడవ జరిగింది. దీంతో అరివలిగన్ తన స్నేహితులకు ఫోన్ చేసి సంఘటన స్థలానికి పిలిపించాడు. అయితే వారు పుత్తనందం ను బస్సులో నుంచి దించగా ఒక వ్యక్తి లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు అని చెప్పాలి. ఇక ఆ దృశ్యాలను మొత్తం వీడియో కూడా తీశారు. అంతేకాదు బాధితుడిని బెదిరించి అతని దగ్గర నుంచి 75 వేల రూపాయలు కూడా లాక్కున్నారు. అయితే బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: