తండ్రిని చంపిన కూతుర్లు.. ఎందుకో తెలుసా?

praveen
మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారుతున్న రోజులు ఇవి. తల్లి. తండ్రి అనే బంధాలకు ఎలాంటి విలువ లేదు. డబ్బు కోసం ఎలాంటి దారుణానికి అయినా ఒడికడుతున్నారు కొందరు. కన్న కూతుర్లు కూడా ఇలా చేస్తారా అని సభ్య సమాజం తలదించుకునేలా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో గల రాజంపేట మండలంలో జరిగిన ఒక సంఘటన చూస్తే అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. 75 ఏళ్ల కొప్పుల ఆంజనేయులు అనే వ్యక్తికి ముగ్గులు కూతుర్లు ఉన్నారు  ఆంజనేయులుని  సొంత కూతుర్లు అంత్యంత కిరాతకంగా హత్య చేయడం తో సర్వత్రా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన నివసిస్తున్న ఇంటికి కుటుంబ సభ్యులు నిప్పు పెట్టడంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే ఆంజనేయులు సజీవ దహనం అయ్యాడు. ఆంజనేయులు కూతుర్లు  కేవలం ఆస్తుల కోసమే ఇలాంటి ఒక దారుణానికి పూనుకున్నట్లుగా తెలుస్తోంది. తన తండ్రి తమకు ఆస్తి ఇవ్వడం లేదని ఆయన ముగ్గురు కూతుర్లు తండిపై కక్ష పెంచుకున్నారు. అతను నిద్రిస్తున్న టైం లో అదును చూసి ఇంటికి నిప్పంటించారు. వీరికి అతని మనవడు భాను ప్రకాష్ కూడా తోడవడంతో ఈ సంఘటన ప్రతి ఒక్కరిని భయాందోళనలకు గురిచేస్తుంది. ఆంజనేయులు తన ఇంట్లోనే నిప్పు అంటుకొని సజీవ దహనం అవుతుండడం చుట్టుపక్కల స్థానికులు కూడా కళ్లారా చూశారు. సొంత కుటుంబ సభ్యులే ఇలా చేశారని అందరూ ఆరోపిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉండగా ఆంజనేయులు కొన్ని రోజుల క్రితం తనకు గల ఎకరం భూమిని అమ్మేశాడు. దాంతో అతనికి ఒక పది లక్షల రూపాయలు వచ్చాయి. అవి తమకు పంచి ఇవ్వాలని ఆంజనేయులుపై కూతుర్లు గొడవకు దిగారు. ఆంజనేయులు అందుకు నిరాకరించడం తోనే ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: