అంత్యక్రియలు జరిగిన 41 రోజుల తర్వాత.. తిరిగొచ్చిన వ్యక్తి?
ఇక ఇప్పుడు అంతకుమించి అనే రేంజ్ లోనే ఒక విచిత్రమైన ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు అని కుటుంబ సభ్యులు అందరూ కూడా అంత్యక్రియలు నిర్వహించారు. అతను పోయిన బాధ నుంచి మెల్లిమెల్లిగా బయట పడుతున్నారు.ఇలాంటి సమయంలో అంత్యక్రియలు జరిగిన నలభై ఒక్క రోజుల తర్వాత చనిపోయిన వ్యక్తి తిరిగి రావడంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన ఎక్కడో కాదు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లో వెలుగులోకి వచ్చింది. ముళ్లపాడు గ్రామానికి చెందిన సయ్యద్ మియా అనే వ్యక్తి గతంలో ఆర్మీలో పని చేసేవాడు.
మద్యానికి బానిసగా మారిపోయిన నేపథ్యంలో సొంత వూరికి వచ్చాడు. ఒక లారీ క్లీనర్గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య కుమార్తె ఉన్నారు. అయితే తరచూ తాగొచ్చి భర్తతో గొడవపడుతూ ఉండడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. సయ్యద్ మియా ఎప్పుడు బయటికి పనికి వెళ్ళిన మూడు నెలల తర్వాత ఇంటికి వస్తూ ఉండేవాడు. అయితే ఇటీవల 40 రోజుల క్రితం మార్కాపురం రైల్వే స్టేషన్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మృతి చెందగా.. అతను సయ్యద్ మియ్య లాగే కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ సయ్యద్ మియ్య అని నిర్ధారించుకుని అంత్యక్రియలు జరిపించారు.. ఇక అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ అంత్యక్రియలు జరిపిన 41 రోజుల తర్వాత అతడు ఇంటికి తిరిగి రావడంతో ఇక అప్పుడు అంత్యక్రియలు జరిపించింది సయ్యద్ మియ్యకు కాదని.. కుటుంబ సభ్యులకు అర్థమైంది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.