పరీక్షల్లో ఫైయిల్ అయ్యాడని పై నుంచి దూకిన విద్యార్థి.. చివరికి..
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరీక్షలో ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురై.. కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకాడు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం చికిత్స కోసం విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కాలెజికి చేరుకున్నారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఎగ్జామ్ రిజల్ట్స్ తర్వాత విద్యార్ధుల ఆవేదన అర్ధం చేసుకోదగినదే. కాదనడం లేదు. అలాగని చదువు మాత్రమే జీవితం కాదు.. అది జీవితంలో ఒక భాగం మాత్రమే అన్నది సామాజివ వేత్తలు చెబుతున్నారు. ధీరూభాయ్ అంబానీ నుంచి అదానీ వరకూ ఫెయిలైన వాళ్లే. అయినా వాళ్లు జీవితంలో ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ఆ వాస్తవాన్ని గుర్తెరిగి ముందుకు సాగాలే గానీ, ఆత్మహత్యలు చేసుకోవడం, ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం సరికాదని నిపుణులు చెబుతున్నారు..నేడు విడుదల అయిన ఫలితాలలో 2,41,591 (54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్లో శాతం 2,58,449 (61 శాతం) మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్లో బాలుర ఉత్తీర్ణత శాతం 49%గా ఉండగా, బాలికలు 65 శాతం పాస్ అయ్యారు. ఇక సెకండ్ ఇయర్లో బాలురు 54 శాతం, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల పరంగా చూసుకుంటే అత్యధికంగా కృష్ణ జిల్లా 72 శాతం, స్వల్పంగా కడపలో 55 శాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు.