క్రికెట్ ప్రాణం తీసింది.. ఏం జరిగిందంటే?
ఎంతో ఆనందం గా క్రికెట్ ఆడుతున్న యువకుడు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన పూణేలో వెలుగు చూసింది. స్నేహితుల తో కలిసి క్రికెట్ ఆడుతున్న 22 ఏళ్ల యువకుడు గ్రౌండ్లో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించినప్పటికి కూడా లాభం లేకుండా పోయింది అని చెప్పాలి. కాగా మృతి చెందిన యువకుడు పేరు శ్రీతేజ్ అనీ తెలుస్తుంది. ఇటీవలే స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి మైదానానికి వచ్చాడు సదరు యువకుడు. ఇక మ్యాచ్ జరుగుతున్న సమయం లోనే ఒక్క సారిగా కుప్పకూలి పోయాడు.
పక్కనే ఉన్న స్నేహితులు అతని వద్దకు చేరుకునే సమయానికి అతను స్పృహలో లేడు. దీంతో స్నేహితులు మరింత భయపడిపోయారు. వెంటనే అతని పక్కనే ఉన్న ఆస్పత్రికి తరలించారు. దీంతో ఇక గుండెపోటుతో సదరు యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా షాక్ లో మునిగి పోయిన స్నేహితులు అతని మరణవార్తను అతని కుటుంబ సభ్యులకు తెలియజేయడం గమనార్హం. ఇక అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే అరణ్యరోదనగా విలపించారు.