కూతురి బర్త్ డే.. అలా చేయడంతో తల్లి ప్రాణం పోయింది?

praveen
ఇటీవలి కాలంలో పుట్టిన రోజు వేడుకలకు ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు సంపన్నులు మాత్రమే ఇలాంటి వేడుకలు జరుపుకునేవారు. ఇప్పుడు మాత్రం సామాన్యులు సైతం తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో పిల్లల పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయంటే చాలు ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ కేక్ తెచ్చి కట్ చేయించడమే కాదు ఇంట్లో చికెన్ మటన్ లాంటి నాన్ వెజ్ వంటకాలు, పిండి వంటకాలు కూడా చేస్తూ ఉంటారు.

 ఇటీవలి కాలంలో పేద వారు సైతం తమ పిల్లల ఆనందం కోసం ఇలాంటివి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే కూతురు పుట్టిన రోజు ఎంతో ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నాడు తండ్రి. ఈ క్రమంలోనే చికెన్ వండాలి అంటూ చెప్పాడు.  కానీ భార్య మాత్రం ఏమాత్రం పెడచెవిన పెట్టింది. ఇక ఈ చిన్న కారణానికి జరగకూడని దారుణం జరిగిపోయింది. కూతురు పుట్టిన రోజు నాడే చివరికి తల్లి ప్రాణాలు వదిలింది. కోడి కూర వండ లేదన్న కారణంతో భార్యను దారుణంగా చంపేసాడు భర్త.

 ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకాలో వెలుగులోకి వచ్చింది. కెంచప్ప, షీలా లకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. ఇటీవలి కాలంలో భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు కెంచప్ప. ఈ క్రమంలోనే తరచూ గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఇటీవల వీరి కూతురు పుట్టినరోజు కావడంతో చికెన్ వండాలి అంటూ భార్యకు చెప్పాడు భర్త. ఆమె పట్టించుకోలేదు. దీంతో సాయంత్రం ఇంటికి వచ్చినా భర్త కోడికూర ఎందుకు వండలేదు అంటూ ప్రశ్నించాడు. ఈ విషయంలో మాట మాట పెరిగింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడిగా మారిన భర్త భార్యను హత్య చేశాడు . తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: