మాజీ ప్రేయసి పై కక్ష.. ఏం చేశాడో తెలుసా?

praveen
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. కేవలం ఒకరి మనసులో ప్రేమ పుట్టి మరొకరు మనసులో ప్రేమ లేనప్పుడు ఆ ప్రేమ బంధం సాఫీగా సాగదు. అయితే ఇటీవలి కాలంలో తాము ప్రేమించిన వారికి మనసులో ఉన్న ప్రేమను వ్యక్త పరచడం చేస్తూ ఉన్నారు ఎంతోమంది. ఇలా ప్రపోజ్ చేసినప్పుడు ప్రేమను రిజెక్ట్ చేయాల లేకపోతే యాక్సెప్ట్ చేయాలా అన్నది ఎదుటి వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ప్రేమను రిజెక్ట్ చేయడం పాపంగా మారిపోయింది అని చెప్పాలి.

 ఏకంగా ప్రేమ రిజెక్ట్ చేసింది అనే కారణంతో ప్రేమించిన వారి పైన పగ పెంచుకుంటున్నారు ఎంతోమంది యువకులు. అప్పటివరకు నువ్వంటే ప్రాణం అంటూ వెంట తిరిగినవారు.. నా ప్రేమను రిజెక్ట్ చేస్తావా నీ ప్రాణాలు తీయకుండా వదలను అంటూ వార్నింగ్ ఇస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొంతమంది ఇంకాస్త రెచ్చిపోయి ఏకంగా ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఏమైందో యువతి అతన్ని దూరం పెడుతుంది. దీంతో అతడు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయాడు.

 ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలిని హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. కానీ చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మాండ్య తాలూకా లో వెలుగులోకి వచ్చింది. నవ్య  పారామెడికల్ కోర్స్ చదువుతుంది. అదే గ్రామానికి చెందిన పరమేష్ తో నాలుగేళ్లుగా ప్రేమ లో ఉంది ఈ యువతి. కొన్నాళ్ల నుంచి పరమేష్ ను దూరంగా పెడుతుంది. దీంతో నవ్యను హత్య చేయాలని పరమేశ్ భావించాడు. ఆమె చదువుతున్న కళాశాల వద్ద వేచి చూసి బయటకు రాగానే కర్రతో దాడి చేశాడు. కానీ అంతలో మిగతా విద్యార్థులు అప్రమత్తమైన అతన్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. తీవ్ర రక్తస్రావం అయిన నవ్య ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: