చనిపోవాలనుకున్న లవర్స్.. నది వద్దకు వెళ్లారు.. కానీ అంతలో ట్విస్ట్?

praveen
ప్రేమ ఎంతో మధురమైనది. క్షణ కాల వ్యవధి లో రెండు మనసుల మధ్య పుట్టిన ప్రేమ చివరికి వందేళ్ల జీవితం లో ఒకరితో ఒకరం సంతోషం గా బ్రతకగలం అనే నమ్మకాన్ని కలిగిస్తూ ఉంటుంది. నేటి రోజుల్లో అయితే కులమతాలకు అతీతంగా పెళ్లి చేసుకుంటున్న ప్రేమ జంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అదే సమయం లో మరో వైపు నుంచి చూస్తే ప్రేమ అంటే ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారి పోయింది.

 కులమతాలను ఎదిరించి పెళ్లి చేసుకున్న వారిని అదే కుల మతాల పేరుతో దారుణం గా హత్య చేస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయ్. అదే సమయం లో తమ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించలేక ఒకరిని విడిచి ఒకరు ఉండలేక చివరికి బలవన్మరణాలకు పాల్పడుతు ప్రాణాలు తీసుకుంటున్నారు మరికొంత మంది. ఇంకోవైపు యుక్త వయసులో చిగురించిన ప్రేమను పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొనసాగిస్తూ జీవితాన్ని దుర్భరం గా మార్చుకుంటున్నారు మరికొంతమంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది అనే చెప్పాలి.

 ఉత్తరప్రదేశ్కు చెందిన చందు అనే 30 ఏళ్ల వ్యక్తి 32 ఏళ్ల మహిళ చాలాకాలం నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇక పెద్దల ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కూడా వేరే వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం సదరు మహిళకు ఆరేళ్ల పిల్లవాడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ వారి ప్రేమను గెలిపించుకోవడానికి సభ్య సమాజాన్ని ఎదిరించి కుటుంబానికి దూరంగా కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ అందరూ ఏమనుకుంటారో అని భావించి కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. యమునా నదిలో దూకాలనీ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే నీటి ప్రవాహానికి భయపడిన చందు దూకలేదు. కానీ అంతలోపే మహిళ నీళ్లలోకి దూకింది. ఆ తర్వాత ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చి ప్రియుడి పై కేసు పెట్టడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: