ప్రేమ పెళ్లి.. కానీ అలా జరగలేదని యువతి ఆత్మహత్య?

praveen
ఆమె ఓ యువకుడిని ప్రేమించింది.. అతనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించికుంది. చివరికి ప్రేమ విషయం ధైర్యం చేసి ఇంట్లో చెప్పింది. ఎంతో కష్టపడి పెద్దలను ఒప్పించింది. ఇక పెద్దలు బంధుమిత్రుల సమక్షంలో వారి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వారి సంసారం కూడా ఎంతో సాఫీగా సాగిపోయింది. కానీ పెళ్లై ఐదు ఏళ్ళు గడిచినా దేవుడు మాత్రం ఆమె కడుపు పండించ లేదు. పిల్లల కోసం ఎంతో మంది డాక్టర్ల చుట్టూ తిరిగిన ఎక్కడా ప్రయోజనం లేకుండా పోయింది.

 ఈ క్రమం లోనే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఎంతో సంతోషం  గా ఉన్నప్పటికీ పిల్లలు కాలేదు అన్న బాధ మాత్రం ఆ మహిళ మనసును తరచు తొలి చేస్తూ ఉండేది. దీంతో తరచూ ఇదే విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంది. అదే సమయంలో బంధువుల నుంచి కూడాసూటిపోటి మాటలు ఎదురవుతూ ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.  చివరికి ఒకరోజు బాధతో కఠిన నిర్ణయం తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది సదరు వివాహిత. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్దిపేట పట్టణ భరత్ నగర్ కు చెందిన శివాని కామారెడ్డి జిల్లా మాచాపూర్ మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన మల్లేశం ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత వీరిద్దరూ సిద్దిపేట లోనే అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

 పెళ్లై 5 ఏళ్ళైన ఇంకా పిల్లలు పుట్టలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివాని ఇక రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో పట్టణ శివారులో ఉన్న కెనాల్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను పిలిచారు. ఇక కుటుంబ సభ్యులు మృతురాలిని గుర్తించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: