ఛీ..ఛీ.. మీకు అసలు బుద్ది ఉందా?

Satvika
ప్రభుత్వాలు మారుతున్నాయి..చట్టాలు మారుతున్నాయి.కానీ లోకంలో ఆడవాళ్ళ పై ఆఘాయిత్యాలు మాత్రం మారలేదు. దేశం నలుమూలల ఏదొక ఘటన జనాలను భయ బ్రాంతులకు గురి చెస్తుంది.. అతి కూరంగా మహిళల పై కామ వాంచన తీర్చుకుంటున్నారు..లొంగితే మానాన్ని దొచుకుంటున్నారు లేకుండా ప్రాణాన్ని తీస్తున్నారు.ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. సినిమాల ప్రభావం మనుషులను నేరస్తులుగా మరుస్తుంది.దిశ లాంటి ఎందరో మహిళలు మాన, ప్రాణాలను కోల్పోతున్నారు.


పోలీసులు ఎంతగా శ్రమించిన ఫలితాలు శూన్యం.. బెదిరించొ, భయపెట్టి కామ కోరికలు తీర్చుకుంటున్నారు.. వావి, వరుసలు, వయస్సు తో అస్సలు వీరికి సంబంధం లేదు.అంతగా దారుణాలకు దిగుతున్నారు.తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.సైన్స్ ఒకవైపు పెరుగుతున్నా కూడా మూఢనమ్మకాలు మాత్రం ఆగలేదు. మంత్రాల పేరుతో యువతులను మోసం చేస్తున్నారు. ఇప్పుడు వెలుగు చూసిన ఘటన అందరినీ షాక్ కు గురి చెస్తుంది.క్షుద్రపూజల పేరుతో కొందరు కేటుగాళ్లు ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


వివరాల్లొకి వెళితే.. సుబ్బయ్య ,భాస్కర్  ఇద్దరు వ్యక్తులు గ్రామంలో క్షుద్రపూజలు చేస్తుండేవారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన పదహారేళ్ల బాలికకు క్షుద్రపూజలతో భయం కల్పించారు. నీ కుటుంబంలో ఓ సమస్య ఉంది.. మేము చెప్పినట్టు వినాలి.. అలా చేయకపోతే నీ తల్లిదండ్రలకు మరణం తప్పదని తనను ఇబ్బందులకు గురిచేశారు. ఆ విధంగా భయపెట్టి ఆమెపై మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే దాడికి చేసిన కొన్ని రోజులకు ఆమె అనారోగ్యానికి గురైంది. కంగారు పడిపోయిన తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించగా బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసింది. విషయం తెలియగానే తల్లిదండ్రులు ఆమెను ఆరా తీయగా తనపై జరిగిన దాడి గురించి చెప్పుకుంది.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందిథులను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: