మరో మహిళతో భర్త సహజీవనం..భార్య పై దాడి..

Satvika
ఈ మధ్య కాలంలో భార్య భర్తలు చిన్న చిన్న విషయాలకు విడిపోతున్నారు..లేదా వేరొకరి మోజులో పడి కట్టుకున్న వారిని వదిలెస్తున్నారు..అది తెలుసుకొని ఎదురు తిరిగితే కోడుతున్నారు.లేదా చూపిస్తున్నారు. ఇప్పుడు మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. భర్త, భార్యను దూరం పెట్టి వేరే మహిళతో డేటింగ్ లో ఉన్నాడని తెలుసుకొని నిల దీసెందుకు భర్త ఇంటికి వెళితే అత్త మామలు ఆమె పై దాడికి దిగారు.విచక్షణా రహితంగా కొట్టారు..ఇక చెసెదెమి లేక ఆమె పోలీసులను ఆశ్రయించింది..పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో గొడవ సర్దు మనిగింది..


వివరాల్లొకి వెళితే..  కోడలిపై మామ, భర్త దాడిచేయగా, విషయం తెలియడంతో కోడలి బంధువులు ప్రతిదాడి చేసిన ఘటన అచ్చంపేట మండల పరిధిలోని క్రోసూరు నాలుగు రోడ్ల సెంటర్‌ లో వెలుగులోకి వచ్చింది. క్రోసూరు నాలుగు రోడ్ల సెంటర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ హసన్‌ తన కుమారుడు జానీబాషాకు నాలుగేళ్ల క్రితం మేన కోడలు షేక్‌ హసీనాను ఇచ్చి వివాహం చేశారు. రెండేళ్ల పాటు వీరి కాపురం సాఫీగా సాగింది. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్ళింది.


ఆర్‌ఎంపీగా పనిచేసే భర్త జానీబాషా హైదరాబాద్‌లో మరో మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు.ఆ విషయం భార్యకు తెలియడంతో తల్లిదండ్రుల తో కలిసి భర్త ఇంటికి రావడంతో మామ హసన్‌ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో హసీనా అచ్చంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం తో దిశ చట్టం కింద కేసు నమోదు చేసి అత్తమామలను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన జానీబాషా ఇంట్లో ఉన్న భార్యపై తండ్రి సహాయం తో దాడికి దిగారు.ఆమె కుటుంబ సభ్యులు వచ్చి మామ, మొగుడి పై దాడి చేశారు..పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: