పాఠశాలలోనే అత్యాచారం.. ఇంతకీ ఏం జరిగిందంటే?

praveen
ఈ లోకం లో ఆడపిల్లలుగా పుట్టడమే మేము చేసిన పాపమా.. ఆడపిల్ల సృష్టికి మూలమైనది అని చెబుతూ ఉంటారు. కానీ నేటి సమాజం లో కనీస రక్షణ లేకుండా పోయిందే. ఇక ప్రతి క్షణం మేము భయ పడుతూ బ్రతకాల్సిందేనా.. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఆడపిల్ల ఇలాంటి ఆలోచనల తోనే భయం భయంగా బ్రతుకుతున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపిన అటు కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.

ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే అత్యాచారాలు చేస్తున్న గ్రామస్తులు కొంత మంది అయితే.. మంచి వాళ్ళం అనే ముసుగు వేసుకొని సమయం సందర్భం కోసం ఎదురు చూసి చివరికి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారు మరికొంత మంది. ఇక సొంత వారి దగ్గర తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే చివరికి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నీచులు ఇంకొంత మంది. వెరసి రోజు రోజుకు అటు ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకం గా మారి పోతోంది.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. నమ్మి వచ్చిన ఎనిమిదో తరగతి బాలిక పై ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలోనే ఓ యువకుడు దారుణం గా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం లోని ఓ గ్రామంలో వెలుగు లోకి వచ్చింది. బాలికకు ఫోన్ చేసి మాయ మాటలు చెప్పిన శ్రీకాంత్ అనే యువకుడు రాత్రి సమయం లో ఆమెను పాఠశాల ఆవరణ లోకి రమ్మని పిలిచాడు.  అక్కడికి వెళ్ళిన బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపు లోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మరో నలుగురు యువకులను కూడా అదుపు  లోకి తీసుకుని విచారిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: