పుట్టింటికి వెళ్ళిన భార్య పై.. భర్త బాంబు దాడి?

praveen
ఏంటో ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే కొంతమంది పెళ్లి చేసుకోవాలంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు అన్యోన్యతకు  కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు భార్య భర్తలు ఇక వారి అన్యోన్యతను చూసి మిగతా యువకులు సైతం పెళ్లి చేసుకుంటే ఇంత బాగుంటుందా అని అనుకునే వారు.. కానీ నేటి రోజుల్లో మాత్రం భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్కడా కనిపించడం లేదు. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వారు  భార్యాభర్తలుగా కాదు బద్ద శత్రువులు గా కనిపిస్తున్నారు నేటి రోజుల్లో భార్యాభర్తల తీరూ చూసిన తర్వాత వామ్మో పెళ్లి చేసుకుంటే ఇంత దారుణంగా ఉంటుందా అని నేటి రోజుల్లో యువకులు పెళ్లి మాట ఎత్తగానే భయపడిపోతున్నారు అని చెప్పాలి.

 కలకాలం ఒకరికి ఒకరు తోడునీడగా కష్టసుఖాల్లో అండగా ఉండాల్సిన భార్య భర్తలు చివరికి ఒకరి ప్రాణాలు ఒకరు  తీయడానికి కూడా వెనకాడడం లేదు. చిన్నచిన్న కారణాలకే దారుణంగా వ్యవహరిస్తూ మానవత్వాన్ని మరిచి పోకు ఏకంగా కట్టుకున్న వారిని కడ తేరుస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆ భార్యభర్తలిద్దరు కొన్నాళ్ల పాటు ఎంతో సంతోషం గానే ఉన్నారు. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరగడం మొదలయ్యాయి. అయితే ఇటీవలే భర్త తీరుతో విసిగి పోయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

 ఇలా జరిగినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు పుట్టింటికి వెళ్ళిన భార్య ను ఏదో ఒకటి చెప్పి ఇంటికి తీసుకువస్తారు. కానీ ఇక్కడ భర్త మాత్రం భార్య పుట్టింటికి వెళ్ళింది అని ఆగ్రహంతో ఊగిపోయాడు.. దీంతో భార్య ప్రాణాలు తీయాలి అనుకున్నాడు. ఏకంగా భార్య పై బాంబు దాడి చేశాడు. ఈ ఘటన గుజరాత్ లోని మలోజ్ గ్రామం లో వెలుగులోకి వచ్చింది. లాల పాకి, శారదా లకు గత 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇక ఇటీవల కాలంలో వీరి మధ్య గొడవలు జరగడం మొదలైంది. దీంతో శారదా పుట్టింటికి వెళ్ళింది. అయితే భార్య పై కోపంతో ఆమెను హత్య చేయాలని అనుకున్నాడు.. శరీరానికి బాంబులు చుట్టుకొని అత్తారింటికి వెళ్లాడు. శారద ఇంటి నుంచి బయటకు రాగానే డిటోనేటర్ నొక్కి పేల్చేసాడు. దీంతో అటు భార్య భర్త ఇద్దరు మృతి చెందారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: