అయ్యయ్యో.. పబ్జీ ఆడుతూ ప్రాణాలను పొగొట్టు కున్నాడే..

Satvika
పబ్జీ అంటే తెలియని యువత లేరు. ఎంత ఆడుతుంటే అంతగా ఆడాలని అనిపించే ఒక మైండ్ గేమ్. దీనికి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫాలొయింగ్ వుంది. ఈ గేమ్ ను ఎక్కువగా యువత బాగా ఇష్ట పడుతున్నారు.. అయితే ఈ గేమ్ ఒక్కసారి ఆడితే చాలు మళ్లీ మళ్లీ ఆడాలనిపిస్తుంది.గంటల తరబడి ఆడినా ఇంకా ఆడాలని అనిపించే ఈ గేమ్ చాలా మంది జీవితాల ను సర్వనాశనం చేసింది. కొంత మంది ప్లేయర్లు పబ్జీ వల్ల ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.

ఇద్దరు అన్నదమ్ములు పబ్జీ ఆటలో లీనమై బయట ఏం జరుగుతుందో కూడా గ్రహించలేక  పోయారు. దాంతో ప్రాణాల ను కొల్పొయారు. ఇది నిజంగానే 'హృదయ విధారా ఘటన అనే చెప్పాలి. లోకేష్ మీనా, రాహుల్ అనే అన్నదమ్ములు కలసి రాజస్థాన్‌ లోని రూప్బాస్ పట్టణం లోని అక్క ఇంట్లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఒకవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూనే మరోవైపు పబ్జీ గేమ్ కు అలవాటు పడ్డారు. ఖాళీ సమయంలో పబ్జీ ఆడుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు..

అలా ఆడుతూ రైలు పట్టాల మీద కూర్చున్నారు. అప్పటికీ వాళ్ళిద్దరూ ట్రైన్ పట్టాల పై నుంచి లేవలేదు. దీంతో క్షణాల్లో నే రైలు వారిద్దరిని బలంగా ఢీకొట్టింది. అంతే, వారిద్దరి శరీరం ఛిద్రం అయ్యింది. ఈ అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో మృతుల అక్క తో పాటు కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరవు తున్నారు. ప్రయోజకులు అవుతారనుకుంటే ఇలా చేతికి అందకుండా చనిపోయారంటూ తండ్రి కన్నీరు పెట్టిన తీరు అందర్నీ కలచి వేసింది.. ఇది ఇప్పుడు ఆ ప్రాంతం లోని వాళ్లని కదిలించి వేసింది. ఇలాంటి వాటిని ఆడే ముందు జాగ్రత్తగా వుండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: