కోతుల ప్రతీకారం.. 250 కుక్కలను చంపేసాయ్?

praveen
సాధారణంగా మనుషుల మధ్య ఇంకా ప్రతీకారాలు  ఉండటం కామన్. కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన ఈ లోకంలో ఎంతో మంది మనుషులు పైకి నవ్వుతూ మాట్లాడుతున్నప్పటికీ లోలోపల మాత్రం ఎంతో మంది పై పగ ప్రతీకారాలు పెంచుకుంటూ ఉంటారు. అయితే కేవలం మనుషుల్లోనే కాదు అటు జంతువుల్లో కూడా ఇలాంటి పగ ప్రతీకారాలు ఉంటాయా అంటే కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే జంతువుల మధ్య కూడా పగ ప్రతీకారాలు ఉంటాయి అని నమ్మాలి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మహారాష్ట్రలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 సాధారణంగా కుక్కలను చూస్తే కోతులు భయంతో పరుగులు పెడుతూ ఉంటాయి అన్న విషయం అందరికి తెలిసిందే.. అందుకే రైతులు పొలాల్లోకి వచ్చిన కోతులను తరిమికొట్టెందుకు ఎక్కువగా కుక్కలను వాటిపైకి ఎగవేస్తూ  ఉంటారు. ఈ క్రమంలోనే ఇక కుక్కలు వెంట పడగానే కోతులు పరుగో పరుగు అంటూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. కోతులు కుక్కలను వెంటాడి వేటాడి మరీ చంపుతూ ఉండటం గమనార్హం.
 ఒకటి కాదు రెండు కాదు రెండు వందల యాభై కుక్కల ప్రాణాలు తీశాయి కోతులు.


 ఈ ఘటన కాస్త గ్రామస్తులు అందరినీ ఎంతగానో ఆందోళనకు గురిచేస్తోంది.. గ్రామస్తులు కోతుల బెడద కారణం గా అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన అధి కారులు మాత్రం కోతులను కూడా పట్టుకోలేకపోయారు అని గ్రామస్తులు చెబుతున్నారు. కోతులు పగ తీర్చుకుంటున్నాయి అంటూ కొంత మంది గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని కుక్కపిల్లలు ఒక కోతిని చంపడంతో ఇదంతా ప్రారంభమైంది అంటూ చెబుతున్నారు. కోతులు ఆ ప్రాంతంలో భయంకరంగ కుక్కలను చంపుతూ పగ తీర్చుకుంటున్నాయి అని అంటున్నారు గ్రామస్తులు.. అయితే గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ పెరిగిపోతోందని గ్రామస్తులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కోతుల బెడద నుండి తప్పించాలి అంటూ కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: