తల్లి కాదు రాక్షసి.. రెండు నెలల పసిగుడ్డును?

praveen
నాగరిక సమాజం లోకి అడుగుపెడుతున్న మనిషి జీవన శైలిలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. దీంతో ఒకప్పటి వివక్షలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఆడపిల్ల మగపిల్లవాడు అనే వివక్ష చూపకుండా ఎవరు పుట్టిన ఎంతో ఆనందపడి పోతున్నారు. ఒకప్పుడుఆడపిల్ల పుడితే భారం గా భావించే వారు తల్లిదండ్రులు.  కానీ నేటి రోజుల్లో ఆడపిల్ల పుడితే బాగుండు అని కోరుకునే వారు ఎక్కువైపోయారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీ దేవత స్వయంగా నడిచి వచ్చింది అని మురిసిపోతున్నారు. ఇలా నేటి రోజుల్లో ఆడపిల్లలపై వివక్ష పూర్తిగా తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి మాత్రం పైపైకి మాత్రమే ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి తప్ప  ఇప్పటికి ఎన్నో ప్రాంతాలలో ఆడపిల్ల పుడితే భారం గా భావిస్తూ చెత్తకుప్పలో పడేస్తున్న తల్లిదండ్రులు తారస పడుతూనే ఉన్నారు.


 పేగు బంధాన్ని సైతం మరిచి అభం శుభం తెలియని శిశువుల ప్రాణాలు తీస్తున్నారు ఎంతోమంది. ఇక్కడ ఓ కసాయి తల్లి ఇలాంటి పని చేసింది. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి   కానీ ఆ బిడ్డ మొఖం చూసి మాత్రం ఆ తల్లి అసహ్యించుకుంది. ఎందుకంటే కొడుకు పుడతాడు అని భావించిన ఆ తల్లికి బిడ్డ పుట్టడంతో అస్సలు నచ్చలేదు. దీంతో ఇక పేగు తెంచుకుని పుట్టిన బంధాన్ని సైతం మర్చిపోయింది. ముక్కు పచ్చలారని ఆ శిశువు విషయంలో ఆ తల్లి ఎంతో కర్కశంగా ప్రవర్తించింది. రెండు రోజుల వయసున్న ఆ చిన్నారిని  పురిట్లోనే చిదిమేసింది ఆ తల్లి.


 సభ్య సమాజం సిగ్గుపడే ఈ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం  రావెలలోకి వెలుగులోకి వచ్చింది. రెండు నెలల పసి కందును కనీసం జాలి దయ లేకుండా చంపేసింది తల్లి.. బొంతు లక్ష్మి అనే మహిళ కు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు ఉన్నాడు. మరోసారి మగపిల్లాడు పుట్టాలి అనే ఆలోచనతో గర్భం దాల్చింది ఆ మహిళ. కానీ ఇటీవలే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆడపిల్ల పుట్టిందని రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను అసహ్యించుకుంది ఆ తల్లి. నోట్లో వేలు పెట్టి ఊపిరాడకుండా చేసింది చివరికి ఆ తల్లి కళ్ళల్లోకి దీనంగా చూస్తూ ఏమీ తెలియని ఆ పసిగుడ్డు ప్రాణాలు వదిలింది. తర్వాత ఏమీ తెలియనట్లు  ఆసుపత్రికి తీసుకెళ్ళింది.   అనుమానం వచ్చిన వైద్యులు నిలదీయడంతో అసలు విషయం ఒప్పుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: