పాపం.. ఇంత చిన్న కారణానికి ఎవరు సూసైడ్ చేసుకోరేమో?

praveen
ఇటీవలి కాలంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అసలు మనిషి ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నాగరిక సమాజం లోకి అడుగుపెడుతున్న మనుషులు చిన్నచిన్న విషయాలకే మనస్థాపం చెంది జీవితం వృధా అని భావిస్తున్నారు. ఇక మరి కొంతమంది ఏకంగా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న చిన్నపాటి గొడవలు ఎన్నో విషాదకర ఘటన లకు కారణం అవుతున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.

 సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరగడం కామన్. కానీ ఆ చిన్నపాటి గొడవలతో మనస్థాపం చెందుతూ ఎంతోమంది కట్టుకున్న వారిని కూడా వదిలేసి చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక రాజస్థాన్లో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త తాను చెప్పిన చొక్కా ధరించలేదు అనే కారణంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఇంత చిన్న కారణంతో ఏ భార్య కూడా ఆత్మహత్య చేసుకొని ఉండకపోవచ్చు అని భావిస్తున్నారు. కోట ప్రాంతంలోని ఆర్కె పురం పోలీస్ స్టేషన్ పరిధిలో అంజలి, శుభమ్ అనే భార్య భర్తలు నివాసముంటున్నారు. భర్త  ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య ఇక ఇంట్లోనే ఉంటుంది. వీరికి రెండేళ్ల క్రితం వివాహం జరగింది.

 ఇకపోతే ఇటీవలే భర్త  బయటకి వెళుతున్న సందర్భంలో తనకు నచ్చిన చొక్కా వేసుకోవాలి అంటూ కోరింది భార్య అంజలి. కానీ భర్త మాత్రం ఆ చొక్కా వేసుకోకుండానే వెళ్ళిపోయాడు. ఇక ఆ తరువాత ఇదే విషయంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇక ఆ రోజు రాత్రి భర్త అలిగి తినకుండానే పడుకున్నాడు. దీంతో మనస్థాపం చెందిన భార్య ఏకంగా ఉదయాన్నే భర్త డ్యూటీ కి వెళ్ళగానే తొందరపాటు నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. డ్యూటీ నుంచి తిరిగివచ్చిన శుభమ్ కు భార్య అంజలి ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన భర్త వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. తన భార్య ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని కలలో కూడా ఊహించలేదు అంటూ భర్త శుభమ్ కన్నీరుమున్నీరయ్యాడూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: