ప్రేమ పేరు చెప్పి.. బాలిక ఉసురు పోసుకున్నాడు?

praveen
ఈ సృష్టికే మూలమైన ఆ మహిళ  ఎంతో గర్వపడాల్సినది పోయి ఇప్పుడు ఆడపిల్లగా పుట్టడమే పాపమా అని బాధ పడే పరిస్థితులు వస్తున్నాయి. దీనికి కారణం సమాజంలో బ్రతుకుతున్న మనుషులే కావడం గమనార్హం. ఎందుకంటే రోజురోజుకు మనుషుల్లో మానవత్వం కనుమరుగై పోతుంది. దీంతో ఆడపిల్ల కనిపిస్తేచాలు ఏకంగా మగాడు మ్రుగాడిగా మారిపోయి దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అయితే ఓ వైపు  ఆడపిల్లలపై అత్యాచారాలు చేయడమే కాదు దారుణంగా హత్యలు సైతం చేస్తుంటే మరోవైపు ప్రేమోన్మాదులు రెచ్చిపోయి ఆడపిల్లలను వేధింపులకు గురి చేయడం లాంటివి చేస్తున్నారు.

 ఇలా ఈ సభ్య సమాజంలో బ్రతుకుతున్న మనుషుల నుంచి అటు ఆడపిల్లకు రోజురోజుకు ప్రమాదం ఎక్కువైపోతుంది. ఆడపిల్ల పై జరిగిన అత్యాచారం ఘటన గురించి మరిచిలోపే ఇంకో అత్యాచార ఘటన వెలుగులోకి వస్తుంది. అంతే కాదు మరోవైపు ప్రేమోన్మాదులు కూడా రెచ్చిపోయి ఆడపిల్లల చావులకు కారణమవుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వెంట పడిన ఓ యువకుడు చివరికి ఆ బాలిక ఉసురు పోసుకున్నాడు. యువకుడి వేధింపులు తట్టుకోలేకపోయిన మైనర్ బాలిక ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకుంది.

 చిన్నవయసులోనే కఠిన నిర్ణయం తీసుకొని నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం లో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మధు అనే యువకుడు కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నాను అంటూ బాలిక వెంటపడుతున్నాడు. తనకు ప్రేమ ఇలాంటివి ఇష్టం లేదు అని చెప్పినప్పటికీ యువకుడు తీరు మాత్రం మారలేదు  తనను ప్రేమించాల్సిందే అంటూ వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. రోజుకు అతని నుంచి వేధింపులు ఎక్కువవడంతో పదిహేనేళ్ల బాలిక మనసు కుమిలిపోయింది. దీంతో చిన్న వయసులోనే కఠిన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: