కూతురు ప్రేమ పెళ్లి.. తల్లి ఏం చేసిందో తెలుసా?

praveen
ఈ రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం నాగరికత వైపు అడుగులు వేస్తోందా లేక ఇంకా అనాగరిక సమాజంలోకి పరుగులు పెడుతుందా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నేటి రోజుల్లో చదువు సంస్కారం ఉన్న మనుషులే అనాగరికంగా ప్రవర్తిస్తున్న తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది.  అయితే సభ్యసమాజంలో బతుకుతుంది మనుషులు కాదు మానవత్వం లేని మృగాలు అన్న విధంగానే ప్రస్తుతం అందరూ వ్యవహరిస్తున్నారు. చిన్నచిన్న కారణాలకే ఏకంగా పైశాచికత్వం సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ముఖ్యంగా నేటి రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడమే పాపం గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రేమ పెళ్లి చేసుకున్నారు అనే కారణంతో ఏకంగా కని పెంచిన తల్లిదండ్రులే దారుణంగా హత మారుస్తున్న  సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దలకు చెబితే వారి పెళ్లికి అంగీకరించలేదు. కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండడం ఇష్టంలేక పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.  కానీ ఆ తర్వాతే వారికి కష్టాలు మొదలయ్యాయి.  ఇక వారి ప్రేమకు ప్రతిరూపంగా మరికొన్ని రోజుల్లో ఒక బిడ్డ వారి జీవితంలోకి రాబోతుంది అని సంతోషపడుతూ ఉన్న తరుణంలో ఆ యువతి తల్లి అమానవీయ ఘటనకు పాల్పడింది.

 నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  జంగారెడ్డి పల్లి కి చెందిన రవి కుమార్ సునీత ప్రేమించుకున్నారు. ఇక పెద్దలు పెళ్ళికి ఒప్పుకోకపోయినప్పటికీ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సునీత 8 నెలల గర్భవతి. అయితే ఇటీవలే ఈ విషయం తెలుసుకున్న సునీత తల్లి వెంకటమ్మ, సోదరి సరిత.  ఇక ఎంతో ప్రేమగా మాట్లాడటం మొదలు పెట్టింది. ఇక ఇటీవల కల్వకుర్తి లోని ఒక ఆసుపత్రికి సునీతను తీసుకెళ్లారు ఇద్దరు. సునీతకు తెలియకుండా ఆపరేషన్ చేయించి బిడ్డ ను తొలగించారు. సునీత తల్లి చేసిన పనికి ఏకంగా రవి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇక సునీత సోదరి, తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: