అమ్మా.. మమ్మల్ని ఎందుకు చంపేస్తున్నావ్?

praveen
ఈ లోకంలో తల్లి ప్రేమను మించింది ఇంకేదీ లేదు అని చెబుతూ ఉంటారు.. నవమాసాలు మోసి పురిటి నొప్పులను కూడా సంతోషంగా భరించి బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ. ఇక పుట్టిన నాటి నుంచి చచ్చిపోయే వరకు తన బిడ్డను చంటిపాపలా గానే చూసుకుంటూ ఉంటుంది. ఇక తన బిడ్డ ఎంత ఎదిగినా ఇంకా చంటి పిల్లాడే అనుకునే అమాయకురాలు అమ్మ.  ఇలా అమ్మ ప్రేమ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్ని పేజీలు రాసినా..  ఎంత గొప్ప పదాలతో వర్ణించినా తక్కువే.  కానీ అలాంటి అమ్మ.. కడుపున పుట్టిన పిల్లల పాలిట మృత్యువు గా మారితే.  అభం శుభం తెలియని ఆ చిన్నారులు పరిస్థితి ఏంటి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల పాలిట ఆ తల్లి మృత్య శకటంగా మారిపోయింది.  కుటుంబ సమస్యలు చుట్టుముట్టడంతో చివరికి అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రాణాలు తీయడానికి సిద్ధమైంది. గోరు ముద్దలు పెట్టిన ఆ చేతులతోనే గొంతు నులిమి చంపేసింది.   పిల్లలది అభం శుభం తెలియని వయసు..  గోరు ముద్దలు పెట్టిన అమ్మ గొంతు నులుముతుంటే.. అమ్మ మమ్మల్ని ఎందుకు చంపేస్తున్నావ్..  అంటూ దీనంగా అమ్మ కళ్ళలోకి చూసారూ ఆ పిల్లలు.


 అయినప్పటికీ ఆ తల్లి మనసు మాత్రం కరగలేదు. గుండె రాయి చేసుకుని ఆ తల్లి చివరికి  కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను కూడా గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణం లోని శాంతి నగర్ కాలనీలో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పిల్లలను గొంతునులిమి హత్య చేసిన తల్లి అనంతరం తాను కూడా కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. చివరికి ఆ తల్లి ప్రస్తుతం కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. కుటుంబ కలహాల వల్లే ఆ తల్లి  ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చు అని స్థానికులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: