పుట్టింటికి వచ్చిన కూతురు ఆత్మహత్య.. ఎందుకంటే..!?

N.ANJI
ఆడపిల్ల కొంచెం ఎదిగిందంటే చాలు ఎప్పుడు ఆమెకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనే ఆలోచిస్తుంటారు. ఇక అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని చెప్పిన వినిపించుకోకుండా పెద్దలు పెళ్లి చేస్తున్నారు. తాజగా అదే కోణంలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతికి ఇష్టం లేకున్నా పెళ్లి చేసి పంపించారు. అయితే ఆషాఢమాసం కావడంతో పుట్టింటికి వచ్చిన ఆమె ఆత్మహత్యకి పాల్పడింది. ఇక ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భంతో ఉంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాలనీలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ కాలనీకి చెందిన చుక్క సారమ్మ భర్త ఏడాది క్రితం కరోనాతో మృతి చెందారు. దాంతో కుమార్తె రమ్యకు పెళ్లి చేయాలని అనుకుంది సారమ్మ. రమ్య డిగ్రీ థర్డ్ ఈయర్ చదువుతుంది. ఇక రమ్య మాత్రం తాను ఉన్నత చదువులు చదువుతానని తల్లికి తెలిపింది. సారమ్మ పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చని కూతురితో చెప్పుకొచ్చింది. అయితే ఐదు నెలల క్రితం రమ్యను ఖమ్మం జిల్లా కారెపల్లి మండలం నెమలిపురి గ్రామానికి చెందిన చీమల వెంకన్నకు ఇచ్చి పెళ్లి చేశారు.
అయితే ఆషాఢమాసం కావడంతో వారం రోజుల క్రితం రమ్యను సారమ్మ పుట్టింటికి తీసుకొచ్చారు. ఇక  రమ్య మూడు నెలల గర్భిణి. సారమ్మ రేషన్ డీలర్ కావడంతో.. బియ్యం పంపిణీ చేసేందుకు వెళ్ళిపోయింది. రమ్య ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని వచ్చింది. ఇక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
సారమ్మ కొంత సమయానికి ఇంటికి తిరిగివచ్చి చూసే సరికి రమ్య ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దాంతో ఒక్కసారిగా కేకలు వేయడంతో  స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి  చేరుకొని పరిశీలించారు. అనంతరం రమ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక  మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: