వైరల్ : రోడ్డుపై వెళ్తుంటే.. రెండు ముక్కలైన ఎలక్ట్రిక్ బైక్?

praveen
ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయిన పెట్రోల్ ధరలు నేపథ్యంలో ఇక ఎంతోమంది ఎలక్ట్రికల్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. సెంచరీకి పైగా పెరిగిపోయిన పెట్రోల్ ధరలతో ఇక సామాన్యులు బెంబేలెత్తుతూ.. ఇక ఈ పెట్రోల్ ధరలు బాధుడికి ఎలక్ట్రికల్ వాహనాలే ప్రత్యామ్యం  అని గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే భారీ ధర పెట్టి మరి ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేయడమే కొంతమంది ప్రాణాల మీదికి తెస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వాహనాలలో నాణ్యతలేమి కారణంగా ఎన్నో వాహనాలు పేలిపోతున్నాయి.

 ఇలా పేలిపోవడం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అన్న విషయం తెలుస్తుంది. అయితే ఇలా ఎలక్ట్రికల్ వాహనాలు పేలిపోవడం లేదా మధ్యలో ఆగిపోవడం లాంటి ఘటన ఇప్పటివరకు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింతగా అందరిని భయపెట్టేస్తుంది. ఏకంగా బైక్ నడుపుతూ ఉండగానే ఎలక్ట్రికల్ వాహనం ఒక్కసారిగా రెండు ముక్కలైంది. అయితే ఇలా రెండు ముక్కలైంది అనగానే మీరు ఎలా షాక్ అవుతున్నారో బైక్ నడుపుతున్న వ్యక్తి అదే విధంగా షాక్ అయ్యాడు.

 ఇక ఇలా బైక్ రెండుగా విడిపోవడం చూసి రోడ్డుపై పోయే వాళ్ళు కూడా ముక్కున వేలేసుకున్నారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఉత్సవ్ ఆగ్రావాలా అనే యువకుడు ఎలక్ట్రికల్ బైక్ పై వెళ్తూ ఉండగా.. స్కూటర్ మధ్యకు విరిగిపోయింది. రెండు ముక్కలుగా ఊడిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి ప్రమాణం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  ఇలా బైక్ రెండు ముక్కలుగా కావడంతో అక్కడున్న వారందరూ ఇదంతా వీడియో తీసుకున్నారు. కాగా బైక్ నడుపుతున్న యువకుడు ఉత్సవ్ ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటాడు. రోజు బైక్ పై వెళ్లాల్సి ఉండడంతో ఖర్చులు తగ్గించుకోవడానికి ఎలక్ట్రికల్ బైక్ కొంటే ఇలా రెండు ముక్కలు అవుతుందని ఊహించలేకపోయాను అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: