మోసం చేసిన ప్రియుడు.. అమ్మాయి రివెంజ్ ఎలా తీర్చుకుందో తెలుసా?

praveen
నేటి జనరేషన్ యువత ప్రేమ అనే పదానికి ఇన్నాళ్లపాటు ఉన్న అర్ధాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తే .. ప్రేమ అనేది కేవలం అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడే ఒక అస్త్రం మాత్రమే అనేట్లుగా అందరూ ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి. ఇక ప్రేమలో పడటానికి ముందు నువ్వే నా ప్రాణం.. నువ్వు లేకుండా అస్సలు బ్రతకలేను.. జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంటూ సినిమాటిక్ డైలాగులు చెబుతున్నారు ఎంతోమంది. ఇక ప్రేమలో పడిన తర్వాత అవసరాలు తీర్చుకొని ప్రాణంగా ప్రేమించాం అన్న వారిని నడిరోడ్డుపై వదిలేస్తున్నారు.

వెరసి నేటి రోజుల్లో అమ్మాయిల చేతిలో అబ్బాయిలు.. అబ్బాయిల చేతిలో అమ్మాయిలు కూడా దారుణంగా మోసపోతూ ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక కొంతమంది అయితే తమను మోసం చేసిన వారిపై కోపం పెంచుకొని ఏకంగా సినిమాను మించిన రేంజ్ లో రివేంజ్ తీర్చుకుంటున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయ్ అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా తనను ప్రేమించి మరో మహిళతో పెళ్లికి సిద్ధపడిన ప్రియుడిపై రివెంజ్ తీర్చుకుంది యువతి. ఏకంగా సలసలా కాగే నూనెను ప్రియుడిపై పోసింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

 భవానిలోని వర్ణపురం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల కార్తీ,  పెరున్దురై లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే ఇక అతనికి బంధువైన మీనాదేవితో అతనికి పరిచయం ఏర్పడగా పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇక ఎన్నో రోజులపాటు మీనాదేవితో చట్టపట్టాలేసుకుని తిరిగాడు కార్తీ. కానీ ఇక మరో మహిళతో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం మీనాదేవికి తెలిసింది. ఈ క్రమంలోనే కార్తీ ని కలిసి అతన్ని నిలదీసింది. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన మీనాదేవి స్టవ్ పై మరుగుతున్న వేడి నూనెను కార్తీపై పోసింది. ముఖం చేతులపై గాయాలయ్యాయి. అతని అరుపులు విన్న చుట్టుపక్కల వారు  అక్కడికి వచ్చి అతని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: