షాకింగ్ : టీచర్ ప్రాణం తీసిన కార్ డోర్?

praveen
నేటి రోజుల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి వారి ప్రాణాలకు వారే రక్షణ కల్పించుకోవాలని అటు ట్రాఫిక్ పోలీసులందరూ కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ అటు వాహనదారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలీ. నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తో ప్రమాదాలను బారిన పడుతూ చివరికి జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటూ ఉన్నారు.

 మరి కొంతమంది ఇక వారు చేసిన పొరపాటు కారణంగా ఇక ఇతరులు ప్రమాదాల బారిన పడే పరిస్థితిని తీసుకువస్తూ ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎంతోమంది రోడ్డుపైన వాహనాన్ని పార్క్ చేసి ఇక అకస్మాత్తుగా కార్ డోర్ ఓపెన్ చేయడం కారణంగా ఇక వెనకాల వస్తున్న వాహనదారులు ప్రమాదం బారిన పడుతూ ఉండడం లాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఇక ఇక్కడ ఇటీవల ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఒక కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బావి భారత పౌరులను తీర్చిదిద్దే ఒక టీచర్ మృత్యువాత పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 మెదక్ కు చెందిన పెంటయ్య అనే వ్యక్తి తన కొడుకుతో కలిసి ద్విచక్ర వాహనం పై కొండాపూర్ వైపు వెళుతూ ఉన్నాడు.  ఈ క్రమం లోనే కాకతీయ హిల్స్ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక కారు డోర్ ని డ్రైవర్ సడన్గా తీశాడు. అయితే అటువైపుగా వెళుతున్న వీరిద్దరి వాహనం కార్ డోర్ కి తగిలి కింద పడింది. అయితే వెనకాలే వేగంగా దూసుకుపోతున్న టిప్పర్ వీరిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే పెంటయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా చివరికి ప్రాణాలు కోల్పోయాడు. కాగా పెంటయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో టీచర్గా పని చేస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: