వైద్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే.. కన్నేసి ఏం చేశాడంటే?

praveen
ఇటీవల కాలంలో మనుషుల మధ్య మనుషుల్లాగే బ్రతుకుతున్న కొంతమంది మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి. ఏకంగా ఆడపిల్ల కనిపించింది అంటే చాలు అడవుల్లో ఉండే మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తూ చివరికి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. వెరిసి నేటి రోజుల్లో వెలుగు చూస్తున్న ఘటనలు ఆడపిల్లలు భద్రత ప్రశ్నార్థకంగా మారిపోయింది అన్నదానికి నిదర్శనంగా మారిపోతున్నాయి అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. సాధారణం గా ఒక డాక్టర్ అన్న తర్వాత మనుషుల ప్రాణాలను కాపాడాలి. ఇటీవల కాలం లో ఎంతో మంది ఆర్ఎంపీ డాక్టర్లు క్లినిక్లు ఏర్పాటు చేసుకుని ఇక వైద్యం అందిస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఇక్కడ ఓ ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇలాగే ఎంతోమందికి చికిత్స అందిస్తూ మనుషుల మధ్య ఉన్నాడు. కానీ ఎందుకో మానవమృగంలాగా మారిపోయాడు. అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు అని చెప్పాలి.

 ఈ ఘటన నారాయణపేట జిల్లా  లో వెలుగు  లోకి వచ్చింది. ధన్వాడ మండలం ఎంనన్ పల్లి గ్రామానికి చెందిన వివాహితుడైన అబ్దుల్ నబీ ఆర్ఎంపీ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. నర్వ మండలం లోని ఓ గ్రామం లో ఇలా క్లినిక్ నిర్వహిస్తున్నాడు. అయితే ఈ క్రమం లోనే ఇటీవల అతని కన్ను ఒక బాలికపై పడింది. ఇక ఆరోగ్య సమస్యల తో బాలిక తన క్లినిక్ కి వచ్చినప్పుడల్లా మాయ మాటలు చెప్పి చివరికి మచ్చిక చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకుని దారుణం గా అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్నాళ్ళకి  స్థానికులకు ఈ విషయం తెలిసింది. దీంతో అతన్ని చితకబాలి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. అయితే ఫోక్సు చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపు లోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: