ఫ్రెండ్ బర్త్ డే పార్టీ.. ఫుల్లుగా మద్యం సేవించి చికెన్ తిన్నాడు.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో మద్యం తాగడం అనేది ఎంతో కామన్ గా మారిపోయింది  ఒకప్పుడు ఎవరికైనా మద్యం తాగి అలవాటు ఉంది అంటే చాలు వారిని ఏదో చెడ్డవాళ్ళు అన్నట్లుగా చూసేవాళ్లు. కానీ ఇటీవల కాలంలో మాత్రం మద్యం తాగే అలవాటు లేని వాళ్ళని చెడ్డవాళ్ళు అన్నట్లుగా విచిత్రంగా చూడటం మొదలు పెడుతున్నారు. ఇక మద్యం తాగడానికి ఏదో స్పెషల్ డే రావాల్సిన పనిలేదు. తాగాలనిపించినప్పుడు ఫుల్లుగా మద్యం తాగుతూ ఇక కిక్కులో ఊగుతూ తూగుతూ ఉన్నారు అని చెప్పాలి.

 మద్యం హానికరం అని తెలిసిన ఎవరు పెద్దగా మద్యం తాగకుండా ఉండడానికి ఆసక్తి చూపడం లేదు.. అయితే ఇప్పటికే మద్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ మరోసారి ఫుల్లుగా తాగిన యువకుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. నిద్రలోనే మరణించాడు. చెన్నై సిటీలో ఉండే మహావిష్ణు అలియాస్ విష్ణు అనే 21 ఏళ్ళ  యువకుడు డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. అయితే ఇక కాలేజీ స్టూడెంట్స్ తో ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడు విష్ణు.  ఇక అతనికి రామ్ కుమార్ అనే స్నేహితుడు ఉండగా ఇటీవలే రామ్ కుమార్  బర్త్ డే కావడంతో పార్టీ చేసుకున్నారు స్నేహితులు.

 స్నేహితులందరికీ రామ్ కుమార్ ఘనంగా బర్త్ డే పార్టీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే విష్ణు బర్త్ డే పార్టీలో మోతాదుకు మించి మద్యం సేవించాడు. తర్వాత అక్కడే విపరీతంగా చికెన్ రైస్ బిర్యానీ కబాబు లాంటివి లాగించేసాడు. తర్వాత స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. ఇక ఎప్పటిలాగానే విష్ణు ఇంటికి వచ్చి నిద్రపోయాడు. కానీ ఉదయం చూడటంతో చలనం లేకుండా కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే మోతాదుకు మించి ఆల్కహాల్ తాగడం చికెన్  తినడం వల్లే విష్ణు ప్రాణం పోయిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు సైతం షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: