కూతురుకు తన పోలికలు రాలేదని.. ఏం చేసాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో మానవత్వం ఉన్న మనుషులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి. ఎందుకంటే పరాయి వాళ్ల విషయంలోనే కాదు సొంత వాళ్ళ విషయంలో కూడా జాలి దయ అనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే చిన్న చిన్న కారణాలకే దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ప్రతిరోజు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఎప్పుడు ఎవరి నుంచి ప్రాణహానికి ఉందో అనే విషయంపై అందరూ భయాందోళనలోనే మునిగిపోతూ ప్రతిక్షణం ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బ్రతుకుతున్నారు అని చెప్పాలి.

 ఇకపోతే ఇక్కడమరో దారుణ ఘటన వెలుగు చూసింది. సాధారణంగా దంపతులకు పిల్లలు పుడితే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి తనకు కూతురు పుట్టింది అని మొదట ఎంతో ఆనందపడిపోయాడు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం కూతురిపై ఉన్న ప్రేమ కాస్త ద్వేషంగా మారిపోయింది. ఎందుకంటే తన కూతురికి తన పోలికలు రాలేదు అని అతను అనుమానపడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఓ రోజు దారుణానికే పాల్పడ్డాడు. ఈ ఘటన ఆగ్రాలోని కండ్వాళి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. మన్మోహన్ సింగ్, మమత లకులకు కొన్నాళ్ళ క్రితమే పెళ్లయింది.

 ఇటీవలే వారికి సౌమ్య అనే కూతురు పుట్టింది. ఇక ఆమెకు ఇప్పుడు ఏడాది వయసు. అయితే సౌమ్యకు తన పోలికలు రాలేదని మన్మోహన్ సింగ్ భావించాడు.ఈ క్రమంలోనే భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. దీంతో అనుమానంతో భార్య తప్పు చేసింది అనే ఆలోచన చేసాడు. ఇదే విషయంపై భార్యతో ఎన్నోసార్లు వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే తన భార్యకు పుట్టిన కూతురు తన పోలికలు లేవని అంటే తనకు పుట్టలేదు అంటూ అనుమానం పెంచుకున్నాడు. ఇక ఇటీవల భార్యను కూతురుని దారుణంగా హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: