ప్రేమ, పెళ్లి, హత్య.. సినిమాను తలపించే స్టోరీ?

praveen
ప్రేమ అంటే ఎన్నో మధురానుభూతులను చిరునామా. ఇద్దరు వ్యక్తులు కాదు రెండు మనసులు ఎప్పుడు కలుస్తాయి అన్నది కూడా ఊహకందని విధం గానే ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమం లోనే ఎంతో మంది ప్రేమికులు ఒకసారి ప్రేమ లో పడిన తర్వాత ఈ ప్రపంచాన్నే మర్చి పోతుంటారు. ప్రేమకు సాటి ఏదీ లేదు అని భావిస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలం లో మాత్రం ప్రేమ అనేది మోసానికి కేరాఫ్ అడ్రస్ గా మారి పోయింది. రక్త పాతానికి చిరునామాగా కొనసాగుతుంది అనే చెప్పాలి.

 ప్రేమ అనే రెండక్షరాల పదాన్ని ఇటీవలే మనుషులు కమర్షియల్ ఎలిమెంట్ గా మార్చుకుంటున్నారు ఈ క్రమం లోనే కేవలం అవసరాలు తీర్చు కోవడానికి మాత్రమే ప్రేమ అనే నాటకం ఆడుతూ చివరికి అవసరాలు తీరిన తర్వాత దారుణం గా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. కాగా సినిమాల ప్రభావం కారణం గా అచ్చం సినిమాల్లో చేసినట్లుగానే ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తిరుపతి జిల్లా కైలాస కోన లో ఇటీవలే ఓ మహిళ అనుమానాస్పదం గా చనిపోవడం సంచలనం గా మారి పోయింది. ఈ క్రమంలోనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం  నిర్వహించిన పోలీసులు ఆమెది హత్య అనే విషయాన్ని తేల్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే చెన్నైకు చెందిన మదన్ తమిళ సెల్వి అనే యువకుడు యువతిని ప్రేమించి పెళ్లాడాడు. కానీ చెడు వ్యసనాలకు బానిసై భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఓ రోజు భార్య అడ్డు తొలగించుకోవాలని కైలాసకోన కు తీసుకువచ్చి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఇక పోలీసుల విచారణలో ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: