ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే మహిళతో ఎఫైర్.. చివరికి ఓ రోజు?

praveen
ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు ఎన్నో దారుణాలకు కారణం గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. వావివరుసలు మరచి పోతున్న ఎంతో మంది మనుషులు చివరికి క్షణకాల    సుఖం కోసం అక్రమ సంబంధాలకు తెర లేపుతూ మానవ బంధాల మంట కలుపుతున్నారు. అంతే కాదు నీచాతి నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారూ. అక్రమ సంబంధాల కారణంగా నేటి రోజుల్లో హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. చిన్నప్పటి నుంచి ఆ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఒక్కరంటే ఒక్కరికీ ప్రాణం ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కలిసి ఉండేవారు.

 ఇలా చిన్నప్పటి నుంచి ఎంతో మంచి స్నేహితులుగా ఉన్న వారిద్దరి మధ్య లోకి ఒక మహిళ వచ్చింది. ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే మహిళతో సంబంధాన్ని పెట్టుకున్నారు ఇద్దరు స్నేహితులు. ఇక సదరు మహిళ కూడా ఒకరికి తెలియకుండా మరొకరు తో సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అయితే నిజం ఎప్పటికైనా బయట పడాల్సిందే కదా.  ఓ రోజు నిజం బయటపడింది. దీంతో బెస్ట్ ఫ్రెండ్స్ బద్ధశత్రువులుగా మారిపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు శివారులో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి చిన్నప్పటినుంచి స్నేహితులు శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. అతనికి పెళ్ళై కుమారుడు కూడా ఉన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఇక వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నాడు. ఇద్దరు స్నేహితులు కూడా తరచు ఒకరి ఇంటికి ఒకరు వెళుతూ ఉండటం చేసేవారు. అయితే శ్రీకాంత్ రెడ్డికి మిధున అలియాస్ జ్యోతి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అప్పటికే పెళ్లయి భర్తతో విడిపోయింది  జ్యోతి. శ్రీనివాస్ రెడ్డికి  శ్రీకాంత్ రెడ్డి స్నేహితుడు కావటంతో అదే చనువుతో ఆమెతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధానికి తెరలేపాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఇక ఇటీవల జ్యోతి ఇంటి ఆవరణలో శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అదే సమయంలో శ్రీకాంత్ రెడ్డి జ్యోతి 10 నెలల పాప తో కలిసి పారిపోవడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: