ప్రేమ పెళ్లి.. కానీ భర్త చేసిన పనికి?

praveen
ప్రతి ఆడపిల్లకు పెళ్లి అనేది ఒక కళ. మేఘాల నుంచి రాజకుమారుడు గుర్రం పై వచ్చి తమను పెళ్లి చేసుకుంటాడు అని  ఆశ పడకున్నా.. ఇక తనను పెళ్లి చేసుకున్న వాడు మాత్రం జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడు అని కోటి ఆశలు పెట్టుకుంటుంది ప్రతి ఆడపిల్ల. ఇక ఇలాంటి ఆశలతోనే మెట్టినింట్లో  అడుగు పెడుతుంది. ఏ కష్టం వచ్చినా భర్తకు చెప్పుకుని బాధ పడుతూ ఉంటుంది. కానీ కష్టాలు తీర్చాల్సిన భర్తే చివరికి కష్టాలపాలు చేస్తే.. ఆ ఆడపిల్ల జీవితం దుర్భరంగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా ఇటీవలి కాలంలో  ఎంతో మంది ఆడపిల్లలు కోటి ఆశలతో మెట్టినింట అడుగుపెట్టి చివరికి కొన్నాళ్ళకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఘటనలు  వెలుగులోకి వస్తున్నాయి.

 ప్రేమ పెళ్లి చేసుకున్నా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసిన ఆడపిల్ల జీవితాల్లో మాత్రం మార్పు రావడంలేదు. రోజురోజుకు అదనపు కట్నం వేధింపులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎంతోమంది ఆడపిల్లలు చివరికి నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్న ఘటనలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాణం కంటే ఎక్కువగా అతన్ని ప్రేమించింది. ఇక జీవితాంతం సంతోషంగా ఉంటాను అనే నమ్మకంతో పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లయిన కొన్నాళ్ళకే భర్త అసలు నిజస్వరూపం బయటపడింది. అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు.

 చివరికి ఈ వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. మైసూరు జిల్లాలోని హెచ్డి కోటి తాలూకాలో మచ్చురు కి చెందిన ఆనంద్, జ్యోతి లకు నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. అయితే ప్రేమ వివాహం కావడంతో దీనిని మనసులో పెట్టుకున్నారు ఆనంద్  తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే పెళ్లి అయిన నాటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని జ్యోతిని వేధించడం మొదలు పెట్టారు. ఈ విషయం భర్తకు చెప్పుకున్న అతడు పట్టించుకునేవాడు కాదు. చివరికి జ్యోతి వేధింపులతో విరక్తి చెంది ఇక ఇటీవల ఎలకల మందు తాగిఆత్మహత్య యత్నం చేసింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: