అమ్మ దగ్గరకని వెళుతుంది.. కానీ అంతలోనే?

praveen
విధి ఆడిన వింత నాటకంలో మనుషులు కేవలం కీలుబొమ్మలు మాత్రమే ఎప్పుడు ఎవరి ప్రాణాలను తీయాలి అన్న విషయంలో వీధికి క్లారిటీ ఉంటుంది. కానీ మనిషి ఇంకా బ్రతకాలి అనే ఆశతో ప్రతిరోజు జీవిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు అభం శుభం తెలియని చిన్నారులు చనిపోయిన సమయంలో ఇక ప్రతి ఒక్కరికి కూడా దేవుడి మీద కోపం వస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అభం శుభం తెలియని చిన్నారులు అనుకోని ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతారు. చివరికి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతుంది.

 ఇలా ఇటీవలికాలంలో ఎవరో చేసిన నిర్లక్ష్యమైన పని కారణంగా అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల కారణంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడు వరకు ఇంట్లోనే ఆడుకున్న చిన్నారి తల్లి వద్దకు వెళ్లేందుకు బయలుదేరింది. కానీ అంతలోనే కారు రూపంలో మృత్యువు ఆ బాలికపై కి దూసుకొచ్చింది. చివరికి రక్తపుమడుగులో ఆ చిన్నారి ప్రాణాలు వదిలింది.

 ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. జంపయ్య, రాజేశ్వరి దంపతులు తిమ్మాపూర్ లోని రాజీవ్ రహదారి పక్కనే ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాజేశ్వరి రహదారి పక్కనే ఉన్న ఒక హోటల్లో పని చేస్తుంది. కాగా వీరికి ఐదో తరగతి చదువుతున్న శివాని అనే పదేళ్ళ కూతురు ఉంది. అయితే ఇటీవలే ఇంట్లో ఆడుకుంటున్న శివాని  హోటల్ లో పనిచేస్తున్న తల్లి దగ్గరకు వెళ్లాలని భావించింది. అంతలో సంతోష్ కుమార్ అనే వ్యక్తి కారు అతి వేగంగా నడుపుతూ వెనకనుంచి వచ్చి శివాని ని ఢీ కొట్టాడు . ప్రమాదంలో చిన్నారి శివాని 30 మీటర్ల మేర ఎగిరిపడింది. ఆస్పత్రికి తరలిస్తుండగా దాడిలో మృతి చెందింది.. అయితే సంతోష్ కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: