నిజాంబాద్ లో ఉగ్రవాదం.. కరాటే క్లాసుల ముసుగులో?
అయితే పీఎఫ్ఐ పేరుతో ఏకంగా 200 మందికి శిక్షణ పొందినట్లు పోలీసులు కూడా గుర్తించారు. నిజాంబాద్ లో మాత్రమే కాదు జగిత్యాల కడప నెల్లూరు కర్నూలు హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన వారు ఇందులో శిక్షణ పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది అని చెప్పాలి. ఇటీవల జగిత్యాల వాసి అయిన అబ్దుల్ ఖాదర్ ఈనెల 4వ తేదీన అరెస్టు చేశారు. అయితే ఖాదర్ స్వస్థలం జగిత్యాల అయినప్పటికీ కొద్ది రోజులు దుబాయ్ లో పని చేసి ఇక్కడికి వచ్చాడు. జగిత్యాల వచ్చినప్పటి నుంచి ఇక పీఎఫ్ఐ లో చురుగ్గా పాల్గొంటున్నట్లు పోలీసు విచారణలో తేలింది. అయితే కరాటే క్లాస్ లు అనే ముసుగులో వరంగల్ వెళ్లి కూడా ట్రైనింగ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
మతోన్మాద భావాలు ఉండే యువకులు ని సెలెక్ట్ చేసుకొని ఇక వారికి ఏకంగా ఆర్థిక సహాయం చేసి మరీ రెచ్చగొట్టే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవలే నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఖాదర్ ఇచ్చిన సమాచారం మేరకు నిజాంబాద్ కు చెందిన చెందిన మహ్మద్ అబ్దుల్ తోపాటు గుండారం గ్రామానికి చెందిన మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనా ఇలా నిజాంబాద్లో కరాటే క్లాస్ ల ముసుగులో పీఎఫ్ఐ శిక్షణ ఇవ్వడం మాత్రం సంచలనంగా మారిపోయింది.