ప్రియురాలితో గొడవ.. యువకుడు ఏం చేసాడో తెలుసా?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలితో గొడవ పడి ఓ వ్యక్తి మనస్థాపానికి గురయ్యాడు. దీంతో ఆత్మహత్యే శరణ్యం అని భావించాడు. షాకింగ్ నిర్ణయం తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. అస్సాం రాష్ట్రానికి చెందిన సానుతప్ప రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. దుండిగల్ లోని గ్రీన్ మెట్రోలో కూలిగా పని చేస్తున్నాడు.. అయితే ఇటీవలే తన ప్రేయసితో ఫోన్ మాట్లాడుతూ గొడవ పడ్డాడు. ఈ విషయాన్ని చిన్నాన్న కుమారుడు సెక్యూరిటీ గార్డ్ సాహిల్ కు చెప్పాడు. అయితే తమ మధ్య ఇలాంటి గొడవలు మామూలే అంటూ చెప్పిన సదరు యువకుడు పడుకునేందుకు ఇంటికి వెళ్లిపోయాడు.
కానీ అదే రోజు రాత్రి సమీపంలో తుమ్మ చెట్టు కు సానుతప్ప ఏకంగా ఉరి వేసుకుని వేలాడుతు కనిపించడం చూసి షాక్ అయ్యాడు చిన్నాన్న కుమారుడు సాహిల్. ఇక వెంటనే భయంతో ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక చిన్నాన్న కుమారుడు సాహిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన కాస్త స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి..