చంపి పడేసిన.. ఇట్లుంటది మనతోని?

praveen
అయ్య బాబోయ్.. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటేనే సభ్యసమాజంలో బ్రతుకుతున్నది మనుషులా మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసులా అన్నది కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు ఇప్పుడు ఉన్మాదానికి హత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. సాటి మనుషుల ప్రాణాలకు కాస్తయినా విలువ ఇవ్వని మనుషులు.. అత్యంత దారుణంగా ప్రాణాలను తోడేస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి.  కేవలం వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా ఇక ఎంతో కర్కశంగా వ్యవహరిస్తున్నారు.
 ఈ క్రమంలోనే ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఎవరు దాడి చేసి ప్రాణాలు తీస్తారో అని ప్రతి ఒక్కరూ అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి నేటి సభ్య సమాజంలో నెలకొంది అనే చెప్పాలి. సొంత తల్లిదండ్రులే పిల్లలను హతమారుస్తూ ఉండటం లేదా కని పెంచిన తల్లిదండ్రులను పిల్లలు ఆస్తులకోసం దారుణంగా హత్యలు చేస్తూ ఉండటం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇదే జరిగింది. జనగామ లోని ఓ బాలుడు మారుతండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.

 ఓ మహిళ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉండలేక వినోద్ అనే 34 ఏళ్ల వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. సదరు మహిళ రెండో పెళ్లి చేసుకునే సమయానికి ఆమెకు 13 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. అయితే సదరు మహిళ రెండో పెళ్లి చేసుకున్న వినోద్ రోజూ తాగి వచ్చి భార్యను వేధిస్తూ ఉండే వాడు. ఇక కొన్నాళ్ల పాటు అతని వేధింపులు భరించలేక సదరు మహిళ విసిగి పోయింది. ఇక ఓ రోజు భర్త గొడవ పెట్టుకోవడం తో ఇక తల్లిదండ్రుల సహాయంతో అతడి కళ్ళల్లో కారం చల్లింది. ఇక 13 ఏళ్ళ కొడుకు కత్తితో గొంతు పొట్ట పై దారుణంగా పడిపోవడంతో వినోద్ అక్కడికక్కడే రక్తపుమడుగులో చనిపోయాడు. చిన్న గొడవ కే వీడిని చంపి పడేసా.. ఇట్లుంటది మనతోని అంటూ వీడియో కూడా తీసుకున్నాడు. ఈ ఘటన సంచలనంగా మారగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: