చంపి పడేసిన.. ఇట్లుంటది మనతోని?
ఈ క్రమంలోనే ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఎవరు దాడి చేసి ప్రాణాలు తీస్తారో అని ప్రతి ఒక్కరూ అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి నేటి సభ్య సమాజంలో నెలకొంది అనే చెప్పాలి. సొంత తల్లిదండ్రులే పిల్లలను హతమారుస్తూ ఉండటం లేదా కని పెంచిన తల్లిదండ్రులను పిల్లలు ఆస్తులకోసం దారుణంగా హత్యలు చేస్తూ ఉండటం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇదే జరిగింది. జనగామ లోని ఓ బాలుడు మారుతండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.
ఓ మహిళ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉండలేక వినోద్ అనే 34 ఏళ్ల వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. సదరు మహిళ రెండో పెళ్లి చేసుకునే సమయానికి ఆమెకు 13 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. అయితే సదరు మహిళ రెండో పెళ్లి చేసుకున్న వినోద్ రోజూ తాగి వచ్చి భార్యను వేధిస్తూ ఉండే వాడు. ఇక కొన్నాళ్ల పాటు అతని వేధింపులు భరించలేక సదరు మహిళ విసిగి పోయింది. ఇక ఓ రోజు భర్త గొడవ పెట్టుకోవడం తో ఇక తల్లిదండ్రుల సహాయంతో అతడి కళ్ళల్లో కారం చల్లింది. ఇక 13 ఏళ్ళ కొడుకు కత్తితో గొంతు పొట్ట పై దారుణంగా పడిపోవడంతో వినోద్ అక్కడికక్కడే రక్తపుమడుగులో చనిపోయాడు. చిన్న గొడవ కే వీడిని చంపి పడేసా.. ఇట్లుంటది మనతోని అంటూ వీడియో కూడా తీసుకున్నాడు. ఈ ఘటన సంచలనంగా మారగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.