ఇదెక్కడి విడ్డూరం.. మేకకు తాళి కట్టిన యువకుడు?

praveen
అప్పుడెప్పుడో సినిమాల్లో చూశాం.. జాతకంలో దోషం ఉందని  మేకలను చెట్లను ముందుగా పెళ్లి చేసుకోవడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక ఇలాంటివి సినిమాల్లో అయితే ఓకే కానీ నిజజీవితంలో అస్సలు జరగవు. మరీ ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో ఇక ఇంపాజిబుల్ అంటూ చెబుతూ వుంటారు చాలామంది. కానీ నేటి ఆధునిక సమాజంలో కూడా ఇంకా ఎంతోమంది మూఢనమ్మకాలను నమ్ముతూ చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్న ఘటనలు వెలుగులోకి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

 ఇటీవలే కృష్ణాజిల్లా నూజివీడు లో కూడా ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. జాతకంలో దోషాలు ఉన్నాయి అని జ్యోతిష్కుడు చెప్పాడు. ఇక రెండు సార్లు వివాహం జరుగుతుంది అంటూ హిత బోధ చేసాడు దీంతో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కంటే ఒక మెకను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుని కొత్త ఆలోచన చేసారు. దీంతో మేక కి తాళి కట్టాడు యువకుడు. అన్నవరం రోడ్డు నవగ్రహ ఆలయంలో ఉగాది పండుగ రోజున పొద్దున్నే ఇక ఉదయం చోటు చేసుకుంది. ఇక ఇదంతా చూసి స్థానికులు అందరూ ముక్కున వేలేసుకున్నారు అని చెప్పాలి.

 ఆధునిక కాలం లో కూడా ఇంకా ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్ముతున్నారా అని చర్చించు కోవడం మొదలు పెట్టారు. అయితే ఇలా మేక తో యువకుడి పెళ్లికి ఆ యువకుడి కుటుంబ సభ్యులు పూజారి తప్ప ఇంకెవరు హాజరు కాకపోవడం గమనార్హం. అయితే కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు వివాహ దోష నివారణ కోసం ఐశ్వర్యా రాయ్ నయన తార లాంటి వాళ్లు సైతం ఏకంగా మొదట చెట్టును పెళ్ళాడారు అంటూ గతం  లో ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా నేటి ఆధునిక సమాజంలో ఇలాంటి ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: