బాలికలను టార్గెట్ చేస్తున్న స్కూల్ యాజమాన్యం..చివరికి..

Satvika
బడులు చదువులు నేర్పి, సన్మార్గంలో నడిపించె దేవాలయాలు అన్న సంగతి ప్రత్యెకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అందుకే విద్యాలయాలు దేవాలయాల తో సమానం అంటారు.. కానీ ఇప్పుడు కొన్ని స్కూల్స్ నేరాలకు కెరాఫ్ గా మారాయి. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. చదువు చెపాల్సిన మాస్టర్ లు దారి తప్పుతున్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దుతారు అనే నమ్మకం తో తల్లి దండ్రులు బడికి పంపితే గురువులు ఇలా చేయడం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను స్కుల్స్ కు పంపాలంటే భయపడుతున్నారు.


బాలికలను వక్ర దృష్టితో చూస్తూ.. తమ కామవాంఛ తీర్చుకోవడానికి, వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. రాజస్థాన్‌ లో ఓ స్కూల్ యజమాని తన విద్యార్థులను టార్గెట్ చేశాడు. పదో తరగతి చదువుతున్న ఓ బాలికను లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నాడు. లైంగిక దాడులు చేసాడు. చివరికి అడ్డంగా బుక్కయ్యాడు. అతని ఎంత కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసిన అది విమర్శలకు దారి తీసింది.


విషయాన్నికొస్తే.. ఈ దారుణ సంఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. జైపూర్ పరిధిలో నివాసం ఉంటున్న దంపతులకు పదో తరగతి చదివే కుమార్తె ఉంది. రోజు స్కూల్ కు వెళ్ళి వచ్చేది. పాఠశాల లో సౌకర్యాలు, విద్యార్థుల బాగోగుల ను పట్టించుకోకుండా నిత్యం బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.. బాలికకు మాయమాటలు చెప్పి దగ్గర చేసుకున్నారు.. స్కూల్ లో ఎవరూ లేని సమయం లో ఓ గదిలోకి తీసుకు పోయి లైంగిక దాడి చేసేవాడు. బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తెల్చి చెప్పారు. గట్టిగా అమ్మాయిని నిలదీయడం తో అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసుల కు ఫిర్యాదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: