మహిళలను దారుణంగా హింసించిన ఇంటి యజమాని..చివరికి..

Satvika
మహిళలకు ఎక్కడా న్యాయం జరగడం లేదు.. అనుమానం పేరుతో కొందరు రాక్షసులుగా ప్రవర్థిస్తె, మరి కొందరు డబ్బు ఉందనే అహం తో మహిళలను దారుణంగా హింసలకు గురి చేస్తున్నారు. మరోవైపు మహిళల పై లైంగిక దాడులు, హత్యలు కూడా జరుగుతున్నాయి.  ప్రభుత్వం , పోలీసులు మహిళల రక్షణ కోసం ఎన్నో కొత్త చట్టాలను అమలు చెస్తున్నారు. వాటికి తగ్గట్లు శిక్షలు విధించినా కూడా మానవ మృగాలు మారలేదు.ఎన్నో ఇప్పుడు బయటకు వస్తున్నాయి.. మహిళల దినోత్సవం సందర్భంగా ఇద్దరు మహిళాలపై ఘోర అవమానం జరిగింది.

ఓ వ్యక్తి ఇంట్లో నగలను దొంగతనం చేశారు అని బట్టలు ఊడదీసి ఒంటి నిండా వాథలు పెట్టాడు.. చివరికి బంగారం దొరికిందని వాళ్ళను దగ్గరుండి ఆటో ఎక్కించాడు. ఈ విషయాన్ని తన భర్తలకు చెప్పవద్దని, అలా చెబితే ప్రాణాలు పోతాయని హెచ్చరించారు.. ఇది నిజంగా అమానుష ఘటన అని చెప్పాలీ.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాల్లొకి వెళితే.. కృష్ణా జిల్లాలో బయటకు వచ్చింది.మహిళలను ఒకవ్యక్తి దారుణంగా హింసించాడు. చందర్లపాడు మండలం ముప్పాల గ్రామంలో రోల్డ్ గోల్డ్ నగలు వీధి వీధికి తిరిగి అమ్ముకుంటున్నారు.

రోజు ఏదొక ఊరికి పోయి అమ్ముకుంటూ జీవినం సాగిస్తున్నారు.సాయంత్రానికి తిరిగి తమ ఇంటికి నందిగామ వెళ్తుండగా ఒక ఇంటి యజమాని వారిని అడ్డుకున్నాడు.. తన ఇంట్లో బంగారం పోయిందని అడ్డు కున్నాడు. మీరు ఇద్దరు దొంగతనం చేశారు. నాకు అనుమానం గా వుంది. మిమ్మల్ని చెక్ చేయాలి. ఇంట్లోకి రండి అని లోపలికి తీసుకెల్లాడు. బట్టలు తీయమని చెప్పాడు.వాతలు పెట్టాడు. ఇంతలో ఇంట్లోనే బంగారం దొరకటంతో పొరపాటు అయ్యిందని చెప్పి దగ్గరుండి వారిని ఆటో ఎక్కించి పంపించాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించారు.. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ణి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: