షాక్ : పోతురాజు విగ్ర‌హం వ‌ద్ద మ‌నిషి త‌ల‌..!

N ANJANEYULU
న‌ల్ల‌గొండ జిల్లాలో  ఈ మ‌ధ్య కాలంలో నిత్యం దారుణ ఘ‌ట‌నలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా ఐదారు సంవ‌త్స‌రాల కింద‌ట న‌ల్లగొండ జిల్లాలోని గుర్రంపోడు మండ‌లంలో ఓ యువ‌కుడు మ‌రొక మ‌తానికి చెందిన యువ‌తిని ప్రేమించ‌డంతో అప్పుడు ఆయువ‌తికి సంబంధించిన కుటుంబీకులు, బంధువులు ఆయువ‌కుడిని నాలుగు ముక్క‌లు నరికి త‌ల ఒక‌చోట‌, మొండం చోట‌, కాళ్లు, చేతులు ఇలా ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట వేసారు. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న పెను దుమారాన్నే లేపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘ‌ట‌న‌పై చ‌ర్చించుకున్నారు.
కులాంతర వివాహం కార‌ణంగా న‌ల్ల‌గొండ జిల్లాలోని మిర్యాలగూడ‌లో 2018 సెప్టెంబ‌ర్ 14న ప్ర‌ణ‌య్ హ‌త్య చేయించారు. ఈ హ‌త్య కూడా రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌న‌మే సృష్టించింది. ప్ర‌ణ‌య్ భార్య అమృత తండ్రి మారుతిరావుతోపాటు ఏకంగా ఏడుగురు నిందితులు క‌లిసి హ‌త్య చేసారు. వారిలో మారుతీరావు, శుభాష్‌శ‌ర్మ హంత‌కుడు, హ‌త్య కుట్ర అమ‌లులో పాత్ర‌దారులు మొహ‌మ్మ‌ద్ బారీ, అస్గ‌ర్ అలీ, మ‌ధ్య‌వ‌ర్తి అబ్దుల్ కరీం, మారుతీరావు సోద‌రుడు  తిరున‌గ‌రి శ్ర‌వ‌ణ్‌, డ్రైవ‌ర్ స‌ముద్రాల శివ‌గౌడ్‌లు  ఈ హ‌త్య‌కు ప్లాన్ చేసి హ‌త్య చేసారు.  ఈ హ‌త్య అనంత‌రం ఆ త‌రువాత చోటు చేసుకున్న ప‌రిణామాల‌లో మారుతీరావు కూడా మృతి చెంద‌డం గ‌మ‌నార్హం.
తాజాగా న‌ల్ల‌గొండ జిల్లాలోని చింతప‌ల్లి మండ‌లం విరాట్‌న‌గ‌ర్‌కాల‌నీలో మైస‌మ్మ గుడివ‌ద్ద  క‌నిపించిన ఓ సీన్ చూసి స్థానికులు హ‌డ‌లిపోయారు. భ‌యంతో గ‌జ‌గ‌జ వ‌ణికారు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం చేర‌వేసారు. ఇంత‌కు అక్క‌డ క‌నిపించిన సీన్ ఏమిటంటే.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తిని హ‌త్య చేసి త‌ల భాగం గుడి ఎదుట వ‌దిలి వెళ్లారు దుండ‌గులు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. మ‌రొక‌వైపు ఇత‌ర శ‌రీర భాగాల కోసం గాలింపులు చేప‌ట్టారు.  ఇది ప్రేమ హ‌త్య‌నా..?   లేక న‌ర‌బ‌లా..? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. ఆ త‌ల అస‌లు ఎవ‌రిదో గుర్తించడానికి పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. మైస‌మ్మ గుడి ముందు మెడ‌లో బొమ్మ త‌ల‌ల దండ‌తో ఉన్న పోతురాజు విగ్ర‌హం కాళ్ల వ‌ద్ద మ‌నిషి శ‌రీరం నుండి వేరు చేసిన త‌ల‌ను వ‌దిలివెళ్లారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా భ‌యాందోళ‌న రేకెత్తించిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: