పడవ బోల్తా... 57 మంది మృతి ?

Veldandi Saikiran
రోడ్డు మార్గం కంటే... సముద్ర చాలా ప్రమాదకంగా మారిపోయింది. తాజాగా లిబియా దేశంలో వలసదారులతో వెళుతున్న ఓ పడవ దురదృష్ట్యావశాత్తు..బోల్తా కొట్టింది. అయితే... ఈ ప్రమాదంలో ఏకంగా 57 వరకు వలస దారులు మరణించి ఉంటారని..తాము అనుకుంటున్నట్లు యూఎన్‌ మైగ్రేషన్‌ కు చెందిన ఓ ఉన్నతాధికారి చెబుతున్నారు. ఈ ప్రమాదానికి గురైన ఆ పడవ లిబియా దేశం పశ్చిమ తీర పట్టణం ఖుమ్స్‌ నుంచి రెండు రోజుల కింద అంటే ఆదివారం రోజున బయలు దేరిందని అంతర్జాతీయ వలస దారుల సంస్థ లో ఉన్న కీలకమైన అధికారి సఫా మెహ్లీ అంటున్నారు.

ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో... ఆ పడవలో ఏకంగా 75 మంది వలస దారుల వరకు ఉన్నట్లు అంచనా వేసింది అల్‌ జబీరా. ఈ 75 మంది వలస దారుల్లో.. 57మంది మరణించగా... మిగిలిన 18 మంది వలస దారులు... సముద్రంలో ఈదుకుంటూ నిన్న రాత్రికి ఒడ్డుకు చేరినట్లు స్పష్టం చేశారు అధికారి సఫా మెహ్లీ.  ఇక మృతి చెందిన 57 మంది వలస దారుల్లో ఎక్కువగా.. నైజీరియా, ఘనా మరియు గాంబియా దేశాలకు చెందిన వారే ఉన్నట్లు అధికారులు తేల్చేశారు. ఈ మేరకు ఓ కీలక ప్రకటన కూడా చేశారు అధికారులు.

అయితే.. ఈ ఘోర ప్రమాదం ఎలా చోటు చేసుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పడవ కు సంబంధించిన ఇంజిన్‌ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సముద్రంలోనే... ఆ పడవ ఆగిపోయి ఉంటుందని... ఆ తర్వాత పరిస్థితి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తోంది అల్‌ జజీరా. అయితే... ఈ పడవ ప్రమాదంపై ఉన్నతాధి కారులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక ఇది ఇలా ఉండగా.... మృతి చెందిన 57 వలస దారులలో... 20 మంది మహిళలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే... ఐరోపాలో మెరుగైన జీవితం కోసం ఈ వలస దారులు, శరణార్థులు మధ్య ధరా సముద్రం మీదుగా పడవలో వెళ్లే... నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: