హెరాల్డ్ స్పెషల్ కర్రీ : ఎంతో రుచికరమైన రొయ్యల బిర్యానీ ఇలా చేసి చుడండి.. !!
కావలసిన పదార్థాలు:
బియ్యం - 1 కేజీ
రొయ్యలు - కేజీన్నర
పెరుగు - 200 గ్రాములు
నిమ్మరసం - 3 టీస్పూన్లు
కారంపొడి- 20 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 100 గ్రాములు
ఉప్పు - సరిపడా
గరంమసాలా - 1 టేబుల్ స్పూన్
రిఫైన్డ్ ఆయిల్ - 100 గ్రాములు
వేగించిన ఉల్లి ముక్కలు (సన్నగా నిలువుగా కోసి) - 30 గ్రాములు
జీడిపప్పు - కొద్దిగా
కొత్తిమీర తరుగు - కొంచెం
పుదీనా తరుగు - 2 కట్టలు
బిర్యానీ ఆకులు - 5 గ్రాములు
డాల్డా లేదా నెయ్యి - 150 గ్రాములు
నీళ్లు - 5 లీటర్లు
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం :
ఒక గిన్నెలో రొయ్యలు వేసి వాటిలో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, వేగించిన ఉల్లి ముక్కలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, ధనియాల పొడి, నూనె వేసి మార్నేట్ చేసుకోవాలి. దీన్ని అర గంట పాటు అలాగే ఉంచాలి.
ఇపుడు పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకుని అందులో లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా వేయించుకుని, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేస్కుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, ఇపుడు అందులో మనం ముందుగా మార్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని కూడా వేసుకుని, అందులో వచ్చిన నీళ్లు అంత ఆవిరి అయ్యేవరకు వేయించాలి.తర్వాత బియ్యానికి సరిపడా నీళ్లు పోసి ఉప్పు చూసుకుని, బాగా మరిగాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా చూసుకుని ,మసులుతున్న నీళ్లలో వేసి ఒకసారి బాగా కదిపి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. తర్వాత కాసేపు సిమ్ లో ఉంచాలి.
20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి. అంతే రుచికరమైన రొయ్యల బిర్యానీ రెడీ అయినట్లే..ఒకసారి టేస్ట్ చేసారంటే అంతే.. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.. !!