రియల్ ఎస్టేట్‌ దూసుపోతోందా?

Chakravarthi Kalyan
పేదవారు మధ్యతరగతి వారుగా ఎదుగుతూ, మధ్య తరగతి వారు మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతున్న వైనం ప్రస్తుతం సమాజంలో హర్షించదగిందే. గతంలో రోజు వారీ కూలీకి రూ. 300 వచ్చేది. ఇప్పుడు అది కాస్త రూ.700 గా పెరిగింది. అంటే పెరుగుతున్న జీతాలు, కూలీల రేట్లు వారి ఎదుగుదలకు కూడా తోడ్పాడుతున్నాయి. దీంతో ప్రతి పేదవారు, మధ్య తరగతి వారు ఉండేందుకు ఇళ్లు, ప్రయాణించేందుకు కారు, లేదా బైక్ కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దిశగా సక్సెస్ అవుతున్నారు.


గతంలో ఇళ్లు కొనడం అనేది లగ్జరీ లైఫ్ గా భావించే వారు. అయితే ప్రస్తుతం ఇళ్లు అనేది ఫెసిలిటీగా భావిస్తున్నారు.  కారు, బైక్ అనేది లగ్జరీగా భావించే స్థాయి నుంచి అవసరం అనే విధానంలోకి మారడంతో ప్రజల్లో మార్పు వస్తుంది. దానికనుగుణంగా లైఫ్ ను కొనసాగిస్తున్నారు.
దీని కోసం కష్టపడుతూ పైకి ఎదుగుతున్నారు. జులై, సెప్టెంబర్ త్రైమాసికాల్లో కార్లు, ఎస్వీయూలు, వ్యాన్లు అత్యధికంగా అమ్ముడుపోయినట్లు వాహనతయారీదారుల సమాఖ్య తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వాహనతయారీ దారుల సంస్థలకు 10 లక్షల 74 వేల 189ప్రయాణికుల వాహనాలు కొన్నారని తెలపింది. 22-23 సంవత్సరంతో పోల్చితే ఈ సంఖ్య 4.7 శాతం అధికంగా ఉందని తెలిపింది. దేశ వ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో ప్లాట్ల కొనుగోలు కూడా చాలా వరకు పెరిగిందని స్థిరాస్తి వ్యాపార సంస్థ జెఎల్ పేర్కొంది.


సంవత్సరంలో లక్ష 96 వేల 226 వేల యూనిట్ల వరకు అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి గతేడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కాకముందే ఎక్కవగా అమ్ముడుపోవడం ఆశించదగిన విషయమన పేర్కొన్నారు. పండగల సమయం కావడంతో మరింత ఎక్కువగా మార్కెట్ నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా స్థిరాస్తి రంగం మెరుగ్గా కొనసాగుతుంది. ఇలాగే కొనసాగితే పోయిన ఏడాది కంటే ఇప్పుడే ఎక్కువగా ప్లాట్ల కొనుగోలు ఎక్కువగా నమోదు కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: