భారతదేశంలో అతి పెద్ద ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పండుగ పూట కస్టమర్లకు చాలా పెద్ద షాక్ ఇచ్చింది.వడ్డీ రేట్లను చాలా భారీగా పెంచుతూ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెరిగిన వడ్డీ రేట్లు కూడా ఆదివారం నుంచే అమల్లోకి రానున్నట్లు బ్యాంక్ తెలిపింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచడం జరిగింది. దీని రుణాలను బట్టి వడ్డీ రేట్లను మొత్తం 10 బేసిస్ పాయింట్ల మేరు పెంచారు. ఇక కాల వ్యవధి ఆధారంగా లోన్ల పై ఈ వడ్డీ రేట్ల పెంపు వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంతో నెలవారీగా లోన్లపై ఈఎమ్ఐలు చెల్లిస్తున్న వారు ఈ నెల నుంచి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.ఇక హౌసింగ్ అలాగే పర్సనల్ లోన్ తీసుకున్న వారిపై ఆర్థిక భారం పడనుంది. సంవత్సరం కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 7.70 శాతం నుంచి 7.80 శాతానికి చేరుకోనుంది. మిగతా లోన్లపై వడ్డీరేటును యథాతథంగా ఉంచడం విశేషం.
దీంతో ఒక్కరోజు లోన్ల పై వడ్డీరేటు 7.85 శాతంగా ఉండగా, నెల, మూడు నెలల లోన్ల పై రేటు 8 శాతంగాను ఇంకా అలాగే ఆరు నెలల
రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8.3 శాతంగా ఉన్నది. అలాగే 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు వచ్చేసి 8.5 శాతంగా ఉంచిన బ్యాంక్..మూడు సంవత్సరాల రేటును 8.6 శాతంగా ఉంచింది.ఇక ఇదిలా ఉంటే ఈ వడ్డీ రేట్ల పెంపు కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే పరిమితం కాలేదు.. హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ ఇంకా అలాగే పీఎన్బీలు కూడా వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక అలాగే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అంటే .. బ్యాంకులు తన కస్టమర్లకు లోన్లు ఇవ్వాలంటే పరిగణనలోకి తీసుకోవాల్సిన బేసిక్ మినిమం రేటునే MCLR అని అంటారు. ఇదే లోన్ ఆధారిత వడ్డీ రేటు. వేర్వేరు రకాల లోన్లు అందుబాటులో ఉన్న క్రమంలో అన్నింటికీ ప్రామాణికంగా ఒక రేటు ఉండాలని bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016 వ సంవత్సరంలో దీనిని ప్రవేశపెట్టడం జరిగింది.