పోస్ట్ ఆఫీస్ : రిస్క్ లేకుండా 35 లక్షలు మీ సొంతం!

Purushottham Vinay
మీరు పెట్టే మీ పెట్టుబడికి ఎలాంటి రిస్క్‌ అనేది కూడా ఉండకూడదంటే మీకు పోస్టాఫీసు అనేది చాలా బెస్ట్‌ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక ఇందులో కనుక మీరు పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో చాలా ఎక్కువ సంపాదించవచ్చు.పైగా ఈ పోస్టాఫీసులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాయి. అందువల్ల ఎలాంటి రిస్క్ అనేది ఉండదు.మీ డబ్బు కూడా చాలా సురక్షితంగా ఉంటుంది.ఇక దేశంలోని ఎన్నో కోట్లాది మంది ప్రజలు ఈ పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి పెడుతున్నారు. మీరు మీరు పెట్టే తక్కువ పెట్టుబడితో మంచి రాబడిని పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడి పెట్టడం చాలా ఉత్తమం. ఇక ఈ స్కీమ్‌లో చిన్న పెట్టుబడిపై సుమారు రూ. 35 లక్షల ఫండ్ క్రియేట్‌ చేయవచ్చు.ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి మీ వయస్సు వచ్చేసి ఖచ్చితంగా 19 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక ఈ పథకంలోని మెచ్యూరిటీ మొత్తాన్ని కూడా పెట్టుబడిదారుడు గరిష్టంగా 80 సంవత్సరాల వయస్సులో పొందవచ్చు.


ఒకవేళ మీరు మెచ్యూరిటీకి ముందు సదరు వ్యక్తి మరణిస్తే ఈ డబ్బు మొత్తం కూడా నామినీకి ఇస్తారు. ఇక ఈ పథకంలో పెట్టుబడిదారుడు కనీసం రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకు కూడా ఈజీగా పెట్టుబడి పెట్టవచ్చు. దీంతో పాటు మీరు ప్రతి నెల, మూడు నెలలు ఇంకా అలాగే 6 నెలలు లేదా వార్షిక ప్రాతిపదికన ప్రీమియం మొత్తాన్ని చెల్లించవచ్చు. ఒక వ్యక్తి ప్రీమియం మొత్తాన్ని కూడా చెల్లించడంలో డిఫాల్ట్ అయితే 1 నెల పొడిగిస్తారు.ఇక మీరు 19 సంవత్సరాల వయస్సులో పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష పథకంలో కనుక రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే, మీరు మీకు 55 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నెలవారీ ప్రీమియంగా రూ. 1,515, ఇంకా అలాగే 58 సంవత్సరాల వయస్సులో రూ. 1,463, ఇక 60 ఏళ్ల వరకు రూ. 1,411 డబ్బుని చెల్లించాలి. ఇక ఈ పెట్టుబడిపై మీరు 55 ఏళ్ల వయస్సులో రూ. 31.60 లక్షలు ఇంకా అలాగే 58 ఏళ్లకు రూ. 33.40 లక్షలు ఇంకా అలాగే 60 ఏళ్లకు రూ. 35 లక్షల మెచ్యూరిటీ ప్రయోజనం పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: